News March 11, 2025

WGL: క్వింటా పత్తి ధర రూ.6,950

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. నిన్న పత్తి ధర క్వింటాకి రూ.6,960 పలకగా.. నేడు రూ.10 తగ్గి.. రూ.6,950కి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారస్థులు తెలుపుతున్నారు.

Similar News

News September 18, 2025

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

పత్తి కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు మద్దతు ధర (MSP) కింద తగిన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News September 18, 2025

వేలూరు సీఎంసీలో ఎన్టీఆర్ వైద్య సేవ లేనట్లేనా..?

image

చిత్తూరు జిల్లా నిరుపేదలు చాలామంది వేలూరు CMC ఆసుపత్రికి వెళ్తుంటారు. క్రిటికల్ కేర్, యాక్సిడెంట్స్, ఇతర ఏ సమస్యలు వచ్చిన ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఈ ఆసుపత్రే. ఇది తమిళనాడులో ఉండటంతో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలు కావడం లేదు. రూ.లక్షల్లో బిల్లులతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోంది.

News September 18, 2025

రేపు OTTలోకి ‘మహావతార్ నరసింహ’

image

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ సినిమా OTT రిలీజ్ డేట్ ఖరారైంది. రేపటి నుంచి Netflixలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మహా విష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. జులై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.