News March 13, 2025
WGL: క్వింటా పత్తి ధర రూ.6,950

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత కొద్దిరోజులుగా పత్తి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,960 పలకగా.. మంగళవారం రూ.6,950కి పడిపోయింది. మళ్లీ బుధవారం రూ.6,960 కాగా.. ఈరోజు మళ్లీ రూ.6,950కి చేరింది. ధర ఏడు వేల దిగువకు పడిపోవడంతో పత్తి పండించిన రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
Similar News
News October 29, 2025
ఉప్పునుంతలలో 183.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

గడిచిన 24 గంటలలో NGKL జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా ఉప్పునుంతలలో 183.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. అచ్చంపేటలో 158.5, చారకొండ 133.8, ఊరుకొండలో 124.3, తెలకపల్లిలో 121.2, బల్మూరులో 120.7, వెల్దండలో 108.0, తాడూరులో 107.5, లింగాలలో 104.5, నాగర్ కర్నూల్లో 101.1, వంగూరులో 99.0 వర్షపాతం నమోదయింది.
News October 29, 2025
డేటా లీక్.. వెంటనే పాస్వర్డ్స్ మార్చుకోండి!

భారీ డేటా ఉల్లంఘనలో 183 మిలియన్లకు పైగా ఈమెయిల్ పాస్వర్డ్లు లీక్ అయినట్లు AUS సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ట్రాయ్ హంట్ ధ్రువీకరించారు. వీటిలో Gmail ఖాతాల వివరాలు కూడా ఉన్నాయి. మాల్వేర్ ద్వారా దొంగిలించిన లాగిన్ ఐడీలతో మొత్తం 3.5 టెరాబైట్ల (875 HD సినిమాలకు సమానం) డేటాను హ్యాకర్స్ రూపొందించారు. మీ ఖాతా వివరాలు లీక్ అయ్యాయో లేదో తనిఖీ చేసుకుని, వెంటనే పాస్వర్డ్లు మార్చుకోవాలని ట్రాయ్ సూచించారు.
News October 29, 2025
సూర్యాపేట జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు బుధవారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.


