News December 15, 2024
WGL: గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734228321056_1072-normal-WIFI.webp)
గ్రూప్-2కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. WGL- 28, HNK- 82, JNGM- 16, BHPL- 17, MHBD- 21, MULUGU- 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అభ్యర్థులను అధికారులు అప్రమత్తం చేశారు. ‘ఉదయం 10 గంటలకు పరీక్ష మొదలవుతుంది. అరగంట ముందే గేట్లు మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. సమయానికి చేరుకోవాలి’ అని సూచించారు. ALL THE BEST
SHARE IT
Similar News
News February 5, 2025
వరంగల్: తాత అంత్యక్రియలకు వెళ్లి మనవడు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738728726029_51846644-normal-WIFI.webp)
వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన వృద్ధుడు పిట్టల మల్లయ్య అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందాడు. కాగా అంత్యక్రియల్లో పాల్గొని చెరువులో స్నానం చేస్తున్న క్రమంలో మల్లయ్య మనవడు పిట్టల రంజిత్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఈరోజు చనిపోయాడు. తాత,మనవడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
News February 5, 2025
మట్టెవాడ క్రైం కానిస్టేబుల్కు ప్రశంసాపత్రం అందజేత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738730853805_717-normal-WIFI.webp)
రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ జరిగిన దొంగతనాలను విశ్లేషించి చోరీలకు పాల్పడిన దొంగల వివరాలను సంబంధిత జిల్లాల పోలీస్ అధికారులకు సమాచారం అందిస్తున్న మట్టెవాడ క్రైం కానిస్టేబుల్ అలీకి వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ప్రశంసా పత్రం అందించారు. కేరళలోని తిరువనంతపురం, కొచ్చికి చెందిన పోలీస్ కమిషనర్లతో పాటు వికారాబాద్ ఎస్పీ అలీని అభినందిస్తూ తెలుపుతూ జారీ చేసిన ప్రశంసాపత్రాలను సీపీ అందజేశారు.
News February 5, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738729388590_18102126-normal-WIFI.webp)
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.