News January 22, 2025

WGL: తరలివచ్చిన పసుపు, పల్లికాయ.. ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు పసుపు, పల్లికాయ తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పసుపు ధర రూ.12,112 పలికినట్లు అధికారులు తెలిపారు. అలాగే సూక పల్లికాయకి నిన్న రూ. 6100 ధర రాగా.. నేడు రూ.6200 ధర వచ్చింది. పచ్చి పల్లికాయ నిన్నటి లాగే రూ.4400 ధర పలికినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. 

Similar News

News November 14, 2025

వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక కంట్రోల్ రూమ్

image

వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు వరంగల్ కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ ప్రారంభించినట్లు కలెక్టర్ సత్య శారద ప్రకటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుల వరకు జరిగే మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈ కంట్రోల్ రూమ్ ముఖ్యపాత్ర పోషిస్తుందని వివరించారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ 1800 425 3424ని సంప్రదించాలన్నారు.

News November 12, 2025

వరంగల్: ఉపాధ్యాయుల హాజరుపై FRS నిఘా..!

image

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల డుమ్మాకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) యాప్ ద్వారా ఉపాధ్యాయుల హాజరుపై నిఘా పెట్టనుంది. హాజరు ఇన్, ఔట్ టైమ్‌లను యాప్‌లో నమోదు చేయకపోతే చర్యలు తప్పవు. సెలవు, ట్రైనింగ్, కార్యాలయ పనులకైనా యాప్ ద్వారా అనుమతి తప్పనిసరి. వరంగల్ జిల్లాలో 325 ప్రాథమిక, 121 ఉన్నత పాఠశాలల్లో ఈ యాప్ అమలు మొదలైంది.

News November 10, 2025

సమగ్ర అభివృద్ధి కోసం పని చేయాలి: కలెక్టర్

image

వరంగల్ కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన డీఆర్డీఏ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రతి శాఖ తమ ప్రణాళికలను సమయపాలనతో అమలు చేస్తేనే గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలపడుతుందని సూచించారు.