News March 12, 2025

WGL: తరలివచ్చిన మొక్కజొన్న.. ధరల్లో స్వల్ప తేడా!

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి ఈరోజు మొక్కజొన్న తరలి వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అయితే, ధర మాత్రం రైతులకు నిరాశ కలిగించింది. మక్కలు(బిల్టీ) ధరలు గత మూడు రోజుల నుంచి ఇలా ఉన్నాయి. సోమవారం క్వింటాకు రూ.2,305 ధర పలకగా.. మంగళవారం రూ.2,310కి చేరింది. ఈరోజు మళ్లీ రూ.2,305కి పడిపోయింది. ఈరోజు సైతం మార్కెట్‌కి పసుపు రాలేదు.

Similar News

News October 29, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో 643mm వర్షపాతం

image

పార్వతీపురం మన్యం జిల్లాలో గడిచిన 24గంటల్లో 643mm వర్షపాతం నమోదైనట్లు అధికారులు బుధవారం తెలిపారు. అత్యధికంగా పాచిపెంట68.2mm, అత్యల్పంగా వీరఘట్టం28.8mm నమోదుకాగా భామిని 50.9mm, జియ్యమ్మవలస 35.8mm, సీతంపేట 66.9mm, గుమ్మలక్ష్మీపురం39.2mm, కొమరాడ29.4mm, కురుపాం36.3mm, Gbl44.2.8mm, సాలూరు48.1mm, పార్వతీపురం34.6, పాలకొండ47.2mm, మక్కువ 41.8mm, సీతానగరం 29mm, బలిజిపేట42.6mm వర్షపాతం నమోదయ్యిందన్నారు.

News October 29, 2025

నల్గొండ: గౌడన్నా జర భద్రం!

image

నల్గొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, గౌడ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. తడిసిన చెట్ల కాండాలు జారే ప్రమాదం ఉందని, ఇది ప్రాణాలకే ముప్పు తెస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా చెట్టుపై పట్టు దొరకకపోవచ్చని, తుఫాను తగ్గేంత వరకు గీత వృత్తికి విరామం ఇవ్వాలని కోరుతున్నారు.

News October 29, 2025

శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మొబైల్స్, ఈ-సిగరేట్స్ సీజ్

image

శంషాబాద్ విమానాశ్రయంలో అరైవల్ ర్యాంప్ వద్ద గుర్తుతెలియని యాష్ కలర్ హ్యాండ్‌బ్యాగ్ వదిలి వెళ్లారు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ వెంటనే SOCCకి సమాచారం అందించింది. తక్షణమే BDDS బృందం ఘటనా స్థలానికి చేరుకుని, తనిఖీలు నిర్వహించి బ్యాగ్‌ సురక్షితమని ప్రకటించింది. బ్యాగ్‌‌లో మొబైల్ ఫోన్లు,ఈ- సిగరెట్లు లభించాయి. మొత్తం విలువ సుమారు ₹12.72 లక్షలని తెలిపారు. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.