News March 12, 2025
WGL: తరలివచ్చిన మొక్కజొన్న.. ధరల్లో స్వల్ప తేడా!

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి ఈరోజు మొక్కజొన్న తరలి వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అయితే, ధర మాత్రం రైతులకు నిరాశ కలిగించింది. మక్కలు(బిల్టీ) ధరలు గత మూడు రోజుల నుంచి ఇలా ఉన్నాయి. సోమవారం క్వింటాకు రూ.2,305 ధర పలకగా.. మంగళవారం రూ.2,310కి చేరింది. ఈరోజు మళ్లీ రూ.2,305కి పడిపోయింది. ఈరోజు సైతం మార్కెట్కి పసుపు రాలేదు.
Similar News
News November 27, 2025
ఇలా పడుకుంటే మొటిమల ముప్పు

సాధారణంగా మన చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియాతో పాటు మృతకణాలూ దిండు పైకి చేరతాయి. దిండు కవర్లను తరచూ మార్చకపోతే మొటిమల ముప్పు ఉంటుంది. అలాగే మేకప్ తొలగించకపోవడం, బోర్లా పడుకోవడం, గదిలో ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వల్ల కూడా చర్మం ఎక్కువ సీబమ్ను ఉత్పత్తి చేసి మొటిమలకు కారణమవుతాయి. కాబట్టి బెడ్రూంను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
News November 27, 2025
ASF: గ్రామ పంచాయతీ ఎన్నికలకు హెల్ప్లైన్ ఏర్పాటు

ఆసిఫాబాద్ కలెక్టరేట్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సమాచారం, సందేహాల పరిష్కారం కోసం కలెక్టరేట్ పరిధిలో టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు (గురువారం)సాయంత్రం నుంచి అందుబాటులోకి రానుంది. ఓటింగ్, నామినేషన్లు, ఎన్నికల ప్రక్రియపై ప్రజలు ఈ నంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అని అధికారులు పేర్కొన్నారు.
News November 27, 2025
మరో తుఫాన్.. ‘దిట్వా’గా నామకరణం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది బలపడి తుఫానుగా మారితే యెమెన్ సూచించిన ‘దిట్వా’ అని నామకరణం చేస్తారు. దిట్వా అనేది యెమెన్ సోకోత్రా ద్వీపంలోని ఫేమస్ సరస్సు పేరు. సెన్యార్ ఏర్పడిన సమయంలోనే ఈ అల్పపీడనం కూడా ఏర్పడిందని IMD తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ వైపు కదులుతూ బలపడే ఛాన్స్ ఉందని చెప్పింది.


