News March 25, 2025

WGL: తరలి వచ్చిన పత్తి.. ధర ఎంతంటే?

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి రైతులకు ధరల విషయంలో ఈరోజు స్వల్ప ఊరట లభించినట్టయింది. నిన్న (సోమవారం) క్వింటా పత్తి ధర రూ.7,030 పలకగా.. నేడు రూ.7045 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ఈరోజు మార్కెట్‌కు భారీగా పత్తి తరలి రాగా.. కొనుగోళ్ల ప్రక్రియ సైతం జోరుగా కొనసాగుతోంది.

Similar News

News November 27, 2025

వరంగల్: 30 ఏళ్ల నాటి స్నేహం.. చివరి శ్వాస వరకూ అంతిమ ప్రయాణం!

image

ఐనవోలు-వెంకటాపురం రోడ్డుపై <<18400053>>బుధవారం రాత్రి జరిగిన<<>> ప్రమాదంలో ఉడుతగూడెంకు చెందిన వెంకట్రెడ్డి(65), ఒంటిమామిడిపల్లికి చెందిన మహ్మద్ యాకూబ్ అలియాస్ చిన్న యాకూబ్(65) అక్కడికక్కడే మృతి చెందారు. ముప్పై ఏళ్లుగా విడదీయరాని ఈ స్నేహితులు రాంపూర్‌లో ఐరన్ రేకులు కొనుగోలు చేసుకుని ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మరణంలోనూ స్నేహితులు కలిసి వెళ్లిపోవడంతో గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News November 27, 2025

32,670 మంది డ్వాక్రా మహిళలకు రూ. 212.32 కోట్లు

image

అల్లూరి జిల్లాలో 3,267 డ్వాక్రా గ్రూపులకు చెందిన 32,670 మంది మహిళలకు రూ.212.32 కోట్లు బ్యాంకు రుణాలను ఇవ్వడం జరిగిందని జిల్లా పీడీ మురళి బుధవారం తెలిపారు. 9 వేల గ్రూపులకు రూ. 417 కోట్లు రుణాలను ఇవ్వాల్సి ఉందన్నారు. తక్కువ వడ్డీతో మహిళల జీవనోపాధులకు రుణాలను ఇస్తున్నామని చెప్పారు. అల్లూరి జిల్లాలో మొత్తం 22,289 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయన్నారు.

News November 27, 2025

ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు: పాక్ రక్షణ మంత్రి

image

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలులో ఆరోగ్యంగా ఉన్నారని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. జైలులో 5స్టార్ హోటల్ కంటే మెరుగైన ఫుడ్ అందుతోందని, టీవీ చూసేందుకు, వ్యాయామానికి అనుమతిచ్చినట్టు చెప్పారు. నేడు, డిసెంబర్ 2న ఆయనను కలిసేందుకు కుటుంబసభ్యులకు జైలు అధికారులు అనుమతిచ్చారు. ఇమ్రాన్‌ను మరో జైలుకు తరలించారనే వార్తలను తోసిపుచ్చారు. రావల్పిండి జైలు దగ్గర ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళన విరమించారు.