News March 25, 2025

WGL: తరలి వచ్చిన పత్తి.. ధర ఎంతంటే?

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి రైతులకు ధరల విషయంలో ఈరోజు స్వల్ప ఊరట లభించినట్టయింది. నిన్న (సోమవారం) క్వింటా పత్తి ధర రూ.7,030 పలకగా.. నేడు రూ.7045 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ఈరోజు మార్కెట్‌కు భారీగా పత్తి తరలి రాగా.. కొనుగోళ్ల ప్రక్రియ సైతం జోరుగా కొనసాగుతోంది.

Similar News

News September 16, 2025

సిరిసిల్ల: ‘బోర్డు జీవో 12ను ప్రభుత్వం వెంటనే సవరించాలి’

image

భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు జీవో 12ను వెంటనే సవరించాలని బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ అన్నారు. సిరిసిల్లలోని శివనగర్ లో సిఐటియు ఆధ్వర్యంలో బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ 3వ మహాసభలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. నిర్మాణరంగంలో పనిచేస్తున్న కార్మికులు దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారని వివరించారు.

News September 16, 2025

నిజామాబాద్: ఈ నెల 17 నుంచి పోషణ మాసం

image

పిల్లల పెరుగుదలకు, పోషణ లోపం తగ్గించుట, బరువు లోపం లేకుండా పోషక ఆహారాలను అందించుటలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోషణ మాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

News September 16, 2025

రానున్న 2-3 గంటల్లో వర్షం.. భారీగా ఈదురు గాలులు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కరీంనగర్, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురవొచ్చని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.