News September 11, 2024

WGL: నిన్నటితో పోలిస్తే పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నిన్న తేజ మిర్చి క్వింటాకు రూ.18,000 పలకగా, నేడు రూ.18,500కి పెరిగింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14,800 ధర రాగా.. నేడు రూ.15,500కి ఎగబాకింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి మంగళవారం రూ.16,000 ధర రాగా నేడు కూడా అదే ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు.

Similar News

News November 20, 2025

వరంగల్: ‘బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను అందజేయాలి’

image

బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను అందజేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్‌పై సమావేశంలో కోరారు. 2002 ఓటర్ల జాబితాను ప్రస్తుతం ఉన్న జాబితాతో సరిపోల్చుతున్నట్టు తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి తొలగింపు, వివరాల సవరణలు జరగనున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు, జెడ్పీ సీఈఓ రామీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News November 20, 2025

సీఎం సహాయనిది పేదలకు ఒక వరం: ఎంపీ కావ్య

image

అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు సీఎం సహాయనిది ఒక వరమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం కావ్య అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఎంపీ CMRF చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 11 మందికి రూ.6 లక్షల 25 వేల విలువైన చెక్కులను అందజేశారు.

News November 19, 2025

వరంగల్ కలెక్టర్‌కు మంత్రి పొంగులేటి అభినందనలు

image

జల సంరక్షణ కేటగిరీ-2లో వరంగల్ జిల్లా అవార్డు సాధించి, ఢిల్లీలో అవార్డు స్వీకరించిన నేపథ్యంలో, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి ఐఏఎస్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ మంత్రితో కాసేపు చర్చించారు.