News March 29, 2025

WGL: పసుపు క్వింటాకు రూ.9329

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం పసుపు, పల్లికాయ తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకి రూ.29,700, సింగిల్ పట్టికి రూ.28వేలు రాగా, దీపిక మిర్చి రూ.13,000 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే పసుపు క్వింటాకి రూ.9,329, సూక పల్లికాయ రూ.7,500, మక్కలు (బిల్టీ) రూ.2255 ధర పలికింది.

Similar News

News December 4, 2025

HYD: DEC 16న అథ్లెటిక్స్ MEET

image

డిసెంబర్ 16న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సబ్ జూనియర్, యూత్ అథ్లెటిక్స్ మీట్ 2025 జరగనుంది. ఉ. 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోటీల్లో 4- 20 ఏళ్లలోపు బాలలు, బాలికలు పాల్గొనవచ్చు. స్ప్రింట్, రన్నింగ్, లాంగ్ జంప్ ఉంటాయి. ఆసక్తి గలవారు https://forms.gle/ouD9qXh9QTyAY7R47 రిజిస్టర్ చేసుకోవాలని. మిగతా వివరాలకు 99630 48320, 99590 91114‌లలో సంప్రదించండి.

News December 4, 2025

అన్నమయ్య: రైలు పట్టాలపై యువకుల మృతి

image

అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. రైలు పట్టాలపై మృతదేహాలు ఉన్నట్లు తిరుపతి-నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ లోకో ఫైలట్ మదనపల్లె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతులు సోమల(M) ఇరికిపెంటకు చెందిన ముని కుమార్, కలికిరి(M) ఆచార్ల కొత్తపల్లికి చెందిన వీర భద్రయ్యగా గుర్తించారు. సెంట్రల్ ట్రాక్‌పై కూర్చొని మద్యం తాగుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో చనిపోయారని సమాచారం.

News December 4, 2025

2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. అప్లై చేశారా?

image

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు ఈ నెల 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు DEC 12వరకు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.