News March 29, 2025

WGL: పసుపు క్వింటాకు రూ.9329

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం పసుపు, పల్లికాయ తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకి రూ.29,700, సింగిల్ పట్టికి రూ.28వేలు రాగా, దీపిక మిర్చి రూ.13,000 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే పసుపు క్వింటాకి రూ.9,329, సూక పల్లికాయ రూ.7,500, మక్కలు (బిల్టీ) రూ.2255 ధర పలికింది.

Similar News

News November 13, 2025

MCEMEలో 49 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

మిలటరీ కాలేజీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్(MCEME)49 గ్రూప్-C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/PET&PST, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News November 13, 2025

HYD: 3 నెలల్లోనే 4,000 కుక్క కాట్లు

image

HYDలో కుక్కల నియంత్రణకు కొత్త చర్యలు అమల్లోకి వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో కుక్కలు మరింత అగ్రసివ్‌గా ప్రవర్తిస్తున్నాయి. కుక్కను బెదిరిస్తే అది వెంటపడి దాడి చేసేలా పరిస్థితి మారిందని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 3 నెలల్లో 4,000 కుక్కల కాట్ల కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సమస్య ఎదురైనప్పుడు వెంటనే GHMC హెల్ప్‌లైన్ 040-21111111 నంబర్‌కి కాల్ చేయాలన్నారు.

News November 13, 2025

హనుమాన్ చాలీసా భావం – 8

image

ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామ లఖన సీతా మన బసియా ||
భావం: రాముడి చరిత్రను వినడానికి ఆసక్తి చూపిన వారి మనసులో రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ నివాసం ఉంటారు.
సుగుణాల రాముడి కథలను వినడం, పఠించడం వల్ల మనసు పరిశుద్ధమవుతుంది. ఫలితంగా ఆ దేవదేవుడు మన హృదయ మందిరంలో స్థిరంగా నిలుస్తాడు. నిత్యం దైవ స్మరణలో ఉంటే జీవితం ధర్మబద్ధంగా, శాంతియుతంగా ఉంటుందని ఈ శ్లోకం బోధిస్తోంది. <<-se>>#HANUMANCHALISA<<>>