News March 23, 2025
WGL: బెట్టింగ్ భూతం.. తీస్తుంది ప్రాణం!

ఐపీఎల్ మొదలు కావడంతో ఇప్పుడు అందరి నోటా బెట్టింగ్ మాటే. ఆటను అస్వాదించే వాళ్లు కొందరైతే, వ్యసనమై బెట్టింగ్లో రూ.లక్షల్లో నష్టపోయి SUICIDE చేసుకునే వాళ్లు కోకొల్లలు. ఈ నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు బెట్టింగ్లపై నిఘా పెట్టారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనించాల్సిన బాధ్యత ఉందన్నారు.
Similar News
News October 19, 2025
పల్నాడు వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున్రెడ్డి

పల్నాడు జిల్లా వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి నియామకాన్ని ఆదివారం ప్రకటించారు. రొంపిచర్లకి చెందిన గెల్లి మల్లికార్జున్రెడ్డి మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. తన నియామకానికి సహకరించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలకు మల్లికార్జున్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
News October 19, 2025
విశాఖ: రేపు కలెక్టరేట్లో PGRS రద్దు

దీపావళి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో సోమవారం విశాఖ కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదివారం తెలిపారు. అధికారులు ఎవరూ అందుబాటులో ఉండరని, కావున ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. వచ్చేవారం యథావిధిగా వినతుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
News October 19, 2025
రాష్ట్ర నేతలకు బండి సంజయ్ వార్నింగ్

TG: మావోయిస్టులకు మద్దతిస్తున్న రాష్ట్ర రాజకీయ నేతలకు కేంద్రమంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. ‘ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తూ నక్సలైట్లకు మద్దతిస్తున్నవారు వెంటనే తమ సంబంధాలను తెంచుకోవాలి. కేంద్ర ఏజెన్సీలు మావోయిస్టుల విషయంలో వెనక్కి తగ్గవు. అవినీతి, నేరాలకు రక్షణ కల్పిస్తున్న వారిని కేంద్రం ట్రేస్ చేస్తోంది. దేశ భద్రత విషయంలో ఎంతటివారినైనా జాలి చూపకుండా ఏరివేస్తుంది’ అని ట్వీట్ చేశారు.