News April 10, 2025

WGL: మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల చిరుధాన్యాలు, సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకు బుధవారం ధర రూ.28వేలు పలకగా.. నేడు రూ.28,500 పలికింది. అలాగే దీపిక మిర్చి క్వింటా ధర నిన్న రూ.12,200 పలకగా.. ఈరోజు రూ.12,500కు తగ్గింది. 5531 మిర్చికి బుధవారం రూ.9,300 పలకగా నేడు రూ.9,500 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే మక్కలు(బిల్టీ) రూ.2,295, పసుపు క్వింటాకి రూ.13,688 ధర వచ్చాయి.

Similar News

News February 17, 2026

జగిత్యాల: 2027 పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ కసరత్తు

image

ధర్మపురిలోని 2027 జూలై 23 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల పుష్కర ఘాట్లను సందర్శించి.. రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి శాశ్వత మౌలిక వసతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ కోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

News February 17, 2026

ధరలు పెరిగినా.. బంగారం దిగుమతులు తగ్గేదేలే!

image

భారత్‌లో ఈ ఏడాది జనవరిలో బంగారం దిగుమతులు ఒక్కసారిగా ఎగబాకాయి. స్విట్జర్లాండ్, UAE నుంచి భారీగా తరలిరావడంతో మొత్తం గోల్డ్ ఇంపోర్ట్స్ $12.1 బిలియన్లకు చేరాయి. దీంతో దేశ వాణిజ్య లోటు 3నెలల గరిష్ఠానికి ($34.7 బిలియన్లు) చేరింది. క్వాంటిటీ పరంగా దిగుమతులు తగ్గుతున్నా ధరలు ఆకాశాన్ని తాకడం వల్లే విలువల పరంగా ఈ పెరుగుదల కనిపిస్తోందని, ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ ఎగబాకడమూ ఓ కారణమని వాణిజ్య శాఖ వివరించింది.

News February 17, 2026

BREAKING: బాన్సువాడ: కారులో రూ.8 లక్షలు చోరీ

image

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మాధవరావు అనే రైతు స్థానిక ఎస్బీఐ బ్యాంకు నుంచి మంగళవారం మధ్యాహ్నం రూ.8 లక్షలు డ్రా చేశారు. అనంతరం పట్టణంలోని రిలయన్స్ సూపర్ మార్కెట్‌లో సరకులు తీసుకోవడానికి కారును పార్కు చేశారు. వచ్చేలోపు గుర్తుతెలియని దుండగులు కారు అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న నగదును దోచుకెళ్లారు. ఈ విషయమై బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి సీసీ ఫుటేజీలను పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు.