News January 24, 2025
WGL: మార్కెట్లో మిర్చి ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా తేజ మిర్చి ధర నిన్న రూ.14,300 ధర పలకగా.. నేడు రూ.14,000కి పడిపోయింది. అలాగే వండర్ హాట్ మిర్చికి గురువారం రూ.13,500 ధర రాగా.. నేడు రూ.14,000కి చేరింది. మరోవైపు 341 రకం మిర్చికి గత 2 రోజుల లాగే రూ.15,500 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 20, 2025
గ్రేటర్ వైపు.. గులాబీ దళం చూపు

జూబ్లీహిల్స్ ఎన్నిక ముగిశాక BRS నాయకులు విశ్రాంతి తీసుకోవడం లేదు. నాయకులు, కార్యకర్తలకు KTR బుధవారం దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి సత్తా తమ ఏంటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉపఎన్నిక ఓటమి తర్వాత KTR కార్యకర్తల్లో ఉత్సాహం నింపే యత్నం చేస్తున్నారు. గతంలో గ్రేటర్ పీఠం BRSకు దక్కింది.. ఇప్పుడూ మనమే దక్కించుకుందామని పేర్కొన్నారు. GHMCలో ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి.
News November 20, 2025
MBNR: U-17, 19.. రేపు సాఫ్ట్ బాల్ ఎంపికలు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17, 19 బాల బాలికలకు సాఫ్ట్ బాల్ జట్ల ఎంపికలను ఈనెల 21న మహబూబ్నగర్లోని స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఈ నెల 20న ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్, సొంత గ్లాజ్లు తీసుకొని ఉదయం 9 గంటల లోపు రిపోర్ట్ చేయాలన్నారు. పూర్తి వివరాలకు 99592 20075, 99590 16610 సంప్రదించాలన్నారు.
News November 20, 2025
పోలవరం: రోడ్డు ప్రమాదంలో డిజిటల్ అసిస్టెంట్ మృతి

పోలవరంలో బుధవారం జరిగిన యాక్సిడెంట్లో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు..పొలవరం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ రామారావు విధులు ముగించుకొని బుట్టాయిగూడెనానికి వస్తుండగా మార్గంమధ్యలో ట్రాక్టర్ను ఢీకొని మృతి చెందినట్లు చెప్పారు. ఈయన భార్య బుట్టాయిగూడెంలో హోంగార్డుగా పని చేస్తున్నారు. ఎస్సై దుర్గ మహేశ్వర రావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ఆస్పుత్రికి తరలించారు


