News March 18, 2025
WGL: రైతులకు గుడ్ న్యూస్.. పెరిగిన పత్తి ధర..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా పెరిగింది. సోమవారం పత్తి ధర క్వింటాకి రూ.6,825 ధర పలకగా.. మంగళవారం రూ.6,975కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధరలు మరింత పెరగాలని ఆకాంక్షిస్తున్నారు.
Similar News
News March 19, 2025
ఇండియాలో 6 అడుగుల ఎత్తున్న వారు ఎందరంటే?

‘ఆరడుగుల అందగాడు’ అని చెప్తూ ఎత్తును ఎందుకు కన్సిడర్ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మన దేశంలో 6 ఫీట్ కటౌట్ కలిగిన వ్యక్తులు చాలా తక్కువ. ఇండియాలో 1శాతం మంది మాత్రమే 6 లేదా అంతకంటే ఎక్కువ ఎత్తును కలిగి ఉన్నారు. భారతీయ మగవారి సగటు ఎత్తు 5.5 అడుగులు (164.94 సెం.మీ) కాగా ఆడవారి సగటు ఎత్తు 5 అడుగులు. అలాగే USAలో 14.5% మంది పురుషులు ఆరు అడుగుల కంటే ఎత్తు ఉన్నారు. మీ హైట్ ఎంత? COMMENT
News March 19, 2025
పల్నాడు: 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీలు

నకరికల్లులోని పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ పి.అరుణ్ బాబు బుధవారం సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. పరీక్షా హాలు వద్ద మంచినీరు అందుబాటులో ఉంచాలని, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులలో లోపాలు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, ఎంఈఓలు, ఉపాధ్యాయులు ఉన్నారు.
News March 19, 2025
దేశంలోనే అత్యంత ధనిక MLA ఇతనే

దేశంలోని 4,092 MLAల ఆస్తులపై ఏడీఆర్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ముంబైలోని ఘాట్కోపర్ ఈస్ట్ శాసనసభ్యుడు పరాగ్ షా(BJP) దేశంలోనే ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. రూ.3,400 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. రూ.1,413 కోట్లతో కర్ణాటక Dy.CM DK శివకుమార్(INC) రెండో స్థానంలో నిలిచారు. రూ.1,700తో దేశంలోనే అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్లోని ఇండస్ శాసనసభ్యుడు నిర్మల్ కుమార్ ధారా(BJP) నిలిచారు.