News March 7, 2025
WGL: విద్యార్థులకు ముఖ్య గమనిక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి పాఠశాల, కళాశాలల్లో ప్రవేశం పొందేందుకు గడువు పొడిగించారు. 5 నుంచి 8వ తరగతి, ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశం పొందేందుకు మార్చి 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జనగామ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 9, 2026
NCERTలో 117 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

<
News February 9, 2026
ASF: జనసేన బోణీ కొడుతుందా?

ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో జనసేన తరఫున మొత్తం 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన ఇక్కడ బోణీ కొడుతుందా? లేక ప్రజల మద్దతు లేక యూ టర్న్ తీసుకుంటుందా..? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ నడుస్తున్న వేళ జనసేన ఫలితం ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
News February 9, 2026
BREAKING: మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,240 పెరిగి రూ.1,58,840కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,050 ఎగసి రూ.1,45,600 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర ఏకంగా రూ.15,000 పెరిగి రూ.3 లక్షలకు చేరింది.


