News March 5, 2025

WGL: శిరీష హత్య కేసులో కీలక మలుపు

image

HYD మలక్‌పేటలో జరిగిన వివాహిత శిరీష హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. HNK జిల్లా పరకాలకు చెందిన శిరీష దోమలపెంటకు చెందిన వినయ్‌ని వివాహం చేసుకుంది. ఈ మేరకు శిరీషను వినయ్ సోదరి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. శిరీషకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరి ఆడకుండా చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో వినయ్, అతడి సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News November 18, 2025

వరంగల్: ‘స్థానిక పోరు’పై మళ్లీ మొదలైన ఆసక్తి

image

స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గ్రామాల్లో మళ్లీ ఎన్నిక కోలాహలం అంతర్గతంగా మొదలైంది. వరంగల్ జిల్లాలో ఆశావహులు ఎన్నికల్లో పోటీపై మరోసారి చర్చలు ప్రారంభించారు. రిజర్వేషన్లు మారనున్న నేపథ్యంలో పోటీ చేయాలా..? వద్దా..? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఎన్నికల హడావుడి తిరిగి మొదలైంది. వరంగల్ జిల్లాలో 317 పంచాయతీలు, 130 MPTC, 11 ZPTC స్థానాలున్నాయి.

News November 18, 2025

వరంగల్: ‘స్థానిక పోరు’పై మళ్లీ మొదలైన ఆసక్తి

image

స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గ్రామాల్లో మళ్లీ ఎన్నిక కోలాహలం అంతర్గతంగా మొదలైంది. వరంగల్ జిల్లాలో ఆశావహులు ఎన్నికల్లో పోటీపై మరోసారి చర్చలు ప్రారంభించారు. రిజర్వేషన్లు మారనున్న నేపథ్యంలో పోటీ చేయాలా..? వద్దా..? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఎన్నికల హడావుడి తిరిగి మొదలైంది. వరంగల్ జిల్లాలో 317 పంచాయతీలు, 130 MPTC, 11 ZPTC స్థానాలున్నాయి.

News November 17, 2025

వరంగల్: ‘గురుకుల పాఠశాల కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి’

image

వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలకు భోజన సరఫరా చేసే క్యాటరింగ్ కాంట్రాక్టర్లు, తమ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన మార్కెట్ ధరలను దృష్టిలో పెట్టుకొని రేట్లను సవరించాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారానికి వినతిపత్రం అందజేశారు. గత నాలుగు నెలలుగా బిల్లులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరావు తెలిపారు.