News March 3, 2025

WGL: శ్రీపాల్ రెడ్డి నేపథ్యం ఇదే..!

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన పింగళి శ్రీపాల్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయనకు 52 ఏళ్లు. వృత్తి రీత్యా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయన గతంలో PRTU TS, UTF రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(AIFTO) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేశారు. 2021లో జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. కాగా ఇటీవల ఆయన తన టీచర్ పోస్ట్‌కు రాజీనామా చేశారు.

Similar News

News December 8, 2025

కరీంనగర్: సర్పంచ్ పీఠం కోసం అభ్యర్థుల తంటాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా సర్పంచి స్థానాలకు ఎక్కువ మంది పోటీలో ఉండటంతో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరోవైపు ప్రచారంలో ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతారోనని అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

News December 8, 2025

చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని మృతి

image

TG: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(M) గొల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సురేందర్ అనే వ్యక్తి నిన్న ఇంట్లో చికెన్ తింటుండగా ఓ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. ఇటీవల ఉమ్మడి MBNR జిల్లాలో గొంతులో గుడ్డు ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే.

News December 8, 2025

ప్రచారానికి 2 రోజులే.. ఓటర్ల మనసు ‘గెలవాలి’

image

పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ NOV 27న మొదలవగా ఉపసంహరణలు ఈనెల 3న పూర్తయ్యాయి. ఇక పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలింది. ఈ రెండ్రోజుల్లో వారి ప్రచారం, ప్రణాళికను బట్టి ఓట్లు వస్తాయి. తొందరపాటులో చేసిన తప్పు ప్రత్యర్థికి పాజిటివ్‌గా మారవచ్చు. నిబంధనలు దాటకుండా ప్రచారం చేస్తేనే మేలు. తొలి విడతలో ఉమ్మడి KNR జిల్లాలో 398 GPలకు, 3682 వార్డులకు పోలింగ్ జరగనుంది.