News January 30, 2025

WGL: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

నిన్న అమావాస్య సందర్భంగా బంద్ ఉన్న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి తరలి వచ్చింది. అయితే మంగళవారంతో పోలిస్తే ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.6,940పలకగా.. నేడు రూ.7,010కి చేరినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా గతవారం రూ. 7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది.

Similar News

News November 4, 2025

రేపు కందికొండ లక్ష్మీనరసింహస్వామి జాతర ప్రారంభం

image

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ జాతర బుధవారం ప్రారంభం కానుంది. రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రకృతి ఆలయంలో ఏటా కార్తీక పౌర్ణమి రోజున వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహస్వామి జాతర వైభవోపేతంగా నిర్వహిస్తారు. కందగిరి గుట్టపై తొలుత ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఆపైన కొండ శిఖరంపై ఉన్న నరసింహ స్వామి ఆలయంలో భక్తులు విశేష పూజలు చేస్తారు.

News November 4, 2025

జన్నారం: లారీ-బైక్ ఢీ.. ఒకరి స్పాట్ డెడ్

image

జన్నారం మండలంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. చింతగూడ-మహమ్మదాబాద్ గ్రామాల మధ్య లారీ-బైక్ ఢీకొన్నాయి. బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడగా అతన్ని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 4, 2025

రూ.1.32 కోట్ల నిధుల హాంఫట్.. సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించిన కలెక్టర్

image

రూ.1.32 కోట్ల నిధులు దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ అయినందున కలెక్టర్ DK బాలాజీ గన్నవరం సర్పంచ్ నిడమర్తి సౌజన్యను పదవి నుంచి తొలగించారు. జిల్లా పంచాయితీ అధికారి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కలెక్టర్ ఆమెను సోమవారం తొలగించారు. విలేజ్ సెక్రటరీతో కలసి నిధులు దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ కాగా..చెరో రూ.66.05 లక్షలు 9 నెలల్లోపు చెల్లించాలని నోటీసులివ్వగా వారు చెల్లించకపోవడంతో కలెక్టర్ ఆమెను తొలగించారు.