News January 30, 2025

WGL: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

నిన్న అమావాస్య సందర్భంగా బంద్ ఉన్న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి తరలి వచ్చింది. అయితే మంగళవారంతో పోలిస్తే ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.6,940పలకగా.. నేడు రూ.7,010కి చేరినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా గతవారం రూ. 7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది.

Similar News

News October 31, 2025

₹10,000 cr సాయానికి AI అభ్యర్థన

image

అహ్మదాబాద్‌లో బోయింగ్-787 కుప్పకూలిన తర్వాత ఎయిర్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ ప్రమాదంలో 260మందికి పైగా మరణించారు. దీంతో నియంత్రణ నిబంధనలు కఠినమై సర్వీసుల నిర్వహణ కష్టంగా మారింది. ప్రాంతీయ ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ఎయిర్ రూట్లలో దూరం పెరిగి ఖర్చుల భారం పెరిగింది. వీటి నుంచి బయటపడేందుకు ₹10,000CR సాయం అందించాలని యాజమాన్య సంస్థలు టాటాసన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను AI అర్థించింది.

News October 31, 2025

పెద్దపల్లి: ఎన్‌సీడీ కార్యక్రమంపై సమీక్షా సమావేశం

image

పెద్దపల్లి కలెక్టరేట్‌లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) కార్యక్రమంపై నర్సింగ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లతో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.వాణిశ్రీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్‌సీడీ వెబ్‌సైట్‌లో వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, అప్డేట్ చేయని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 13 ఉప కార్యక్రమాల అమలు, ప్రజారోగ్య పరిరక్షణ ప్రాముఖ్యతపై సమగ్ర మార్గదర్శకాలు జారీ చేశారు.

News October 31, 2025

MGB, NDAలకు కీలకంగా మారిన ‘బిహార్ వార్’

image

బిహార్‌లో ప్రధాన కూటములు పోటాపోటీ హామీలు గుప్పించాయి. ‘తేజస్వీ ప్రాణ్’ పేరిట MGB ‘సంపూర్ణ బిహార్ కా సంపూర్ణ పరివర్తన్’ నినాదంతో స్టేట్ రూపురేఖలు మారుస్తామంది. గత ప్రభుత్వ అవినీతిని నిర్మూలిస్తామని చెప్పింది. NDA ‘సంకల్ప్ పాత్ర్’ పేరుతో రాష్ట్రాన్ని పారిశ్రామిక, విద్యా కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చింది. ఈ ఎన్నికలు అక్కడి పాలనా పగ్గాల కోసమే కాక హిందీ బెల్టులో పాగా వేసేందుకు కీలకం కావడమే కారణం.