News January 30, 2025

WGL: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

నిన్న అమావాస్య సందర్భంగా బంద్ ఉన్న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి తరలి వచ్చింది. అయితే మంగళవారంతో పోలిస్తే ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.6,940పలకగా.. నేడు రూ.7,010కి చేరినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా గతవారం రూ. 7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది.

Similar News

News December 2, 2025

భూపాలపల్లి: 3న దివ్యాంగుల దినోత్సవం

image

జిల్లాలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ సమావేశం హాల్‌లో ఈ వేడుక జరుగుతుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి మల్లిశ్వరి తెలిపారు. జిల్లాలోని అన్ని రకాల దివ్యాంగులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆమె కోరారు.

News December 2, 2025

HYD: ప్రముఖ హోటళ్లపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

image

హైదరాబాద్‌లో ప్రముఖ హోటళ్ళపై ఐటీ శాఖ దాడుల పరంపర కొనసాగుతోంది. వుడ్‌బ్రిడ్జ్ హోటల్ యజమాని హర్షద్ అలీ ఖాన్ను ఐటీ అధికారులు విచారించారు. పిస్తా హౌస్, షాగోస్, మేఫిల్ వంటి హోటళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆర్థిక లావాదేవీలపై, ఇతర హోటళ్లతో ఉన్న సంబంధాలపై ఐటీ శాఖ దృష్టి సారించి పరిశీలన జరుపుతోంది.

News December 2, 2025

ఈసారి IPL వేలంలో పాల్గొనట్లేదు: మ్యాక్స్‌వెల్

image

IPL-2026 వేలంలో తాను పాల్గొనట్లేదని ఆస్ట్రేలియన్ క్రికెటర్ <<18444972>>మ్యాక్స్‌వెల్<<>> ప్రకటించారు. అనేక సీజన్ల తర్వాత ఈ ఏడాది వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఐపీఎల్ తనను క్రికెటర్‌గా, వ్యక్తిగా తీర్చిదిద్దిందని తెలిపారు. వరల్డ్ క్లాస్ టీమ్‌మేట్స్, ఫ్రాంచైజీలతో పనిచేయడం తన అదృష్టమని, ఏళ్లుగా మద్దతిచ్చిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. త్వరలో కలుస్తానని పేర్కొన్నారు.