News August 12, 2024
WGL: స్వల్పంగా పెరిగిన పల్లికాయ, పసుపు ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి నేడు పసుపు, పల్లికాయ తరలివచ్చాయి. క్వింటా సూక పల్లికాయకి రూ.6,450, పచ్చి పల్లికాయకు రూ.4,050 ధర వచ్చింది. అలాగే పసుపు క్వింటా రూ.14,011 ధర, 5531 రకం మిర్చి రూ.11,500 ధర పలికిందని వ్యాపారులు తెలిపారు. అయితే మొన్నటితో పోలిస్తే నేడు అన్ని రకాల సరకుల ధరలు స్వల్పంగా పెరిగాయని అధికారులు తెలిపారు.
Similar News
News November 26, 2025
వరంగల్: ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి!

WGL జిల్లా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని శాఖలు సన్నద్ధమవాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. మూడు విడతల్లో జరిగే ఎన్నికల్లో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని టెలికాన్ఫరెన్స్లో సూచించారు. కోడ్ అమలు, హోర్డింగుల తొలగింపు, నిఘా బృందాల ఏర్పాటు, మద్యం-డబ్బు పంపకాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, లైటింగ్, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలన్నారు.
News November 26, 2025
బండవతపురంలో రిజర్వేషన్ గందరగోళం

WGL జిల్లా వర్ధన్నపేట మండలం బండవతపురం గ్రామంలో మొత్తం 1,550 ఓట్లు ఉండగా సర్పంచ్ స్థానం జనరల్కు కేటాయించారు. గ్రామంలో 10 వార్డుల్లో 5 జనరల్, 5 ఎస్సీ రిజర్వ్ చేశారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక్క వార్డూ బీసీ కేటగిరీకి రాకపోవడంతో గ్రామ రాజకీయాలు వేడెక్కాయి. బీసీ ఓటర్లు ఉన్నచోట ఎస్సీ, ఎస్సీ ఓటర్లు ఉన్నచోట జనరల్ వార్డులు రావడం గందరగోళానికి దారి తీసింది. దీంతో నువ్వా? నేనా? అన్నట్టుగా ఉంది.
News November 26, 2025
బండవతపురంలో రిజర్వేషన్ గందరగోళం

WGL జిల్లా వర్ధన్నపేట మండలం బండవతపురం గ్రామంలో మొత్తం 1,550 ఓట్లు ఉండగా సర్పంచ్ స్థానం జనరల్కు కేటాయించారు. గ్రామంలో 10 వార్డుల్లో 5 జనరల్, 5 ఎస్సీ రిజర్వ్ చేశారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక్క వార్డూ బీసీ కేటగిరీకి రాకపోవడంతో గ్రామ రాజకీయాలు వేడెక్కాయి. బీసీ ఓటర్లు ఉన్నచోట ఎస్సీ, ఎస్సీ ఓటర్లు ఉన్నచోట జనరల్ వార్డులు రావడం గందరగోళానికి దారి తీసింది. దీంతో నువ్వా? నేనా? అన్నట్టుగా ఉంది.


