News July 6, 2025
WGL: అందరి చూపు గాంధీ భవన్ వైపే..!

HYD గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సోమవారం కీలక సమావేశం కానుంది. WGL కాంగ్రెస్ MLAలు, మంత్రి సురేఖ మధ్య విభేదాలతో వచ్చిన ఫిర్యాదులపై కమిటీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొండా మురళి వ్యాఖ్యలపై MLAలు ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి దృష్టికి తీసుకెళ్లగా.. మురళి, సురేఖ సైతం ఆమెను కలిసి తమ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాగా రేపటి సమావేశం వరంగల్లో ఉత్కంఠ రేపుతోంది.
Similar News
News July 7, 2025
తెలంగాణలో ‘జాగీర్’ ఫైట్!

‘తెలంగాణ BRS జాగీరా?’ అని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ కోసం పోరాడింది BRS అని, తెలంగాణ తమ జాగీరే అని ఆ పార్టీ నేతలు పోస్టులు చేస్తున్నారు. ఆంధ్ర పత్రికలు మరోసారి విషం చిమ్ముతున్నాయని ఫైరవుతున్నారు. అయితే BRSని విమర్శిస్తే తెలంగాణను తిట్టినట్లు కాదని కాంగ్రెస్ నేతలు కౌంటరిస్తున్నారు. మళ్లీ సెంటిమెంటును రెచ్చగొడుతున్నారని మండిపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News July 7, 2025
కడుపులో పెన్నులు.. బయటకు తీసిన వైద్యులు

నరసరావుపేటకి చెందిన 28 ఏళ్ల యువతి కడుపులో ఉన్న నాలుగు పెన్నులను వైద్యుడు రామచంద్రారెడ్డి శస్త్ర చికిత్స చేసి వెలికి తీశారు. వాంతులతో వైద్యశాలకు చేరిన యువతకి సిటీ స్కాన్ చేయడం ద్వారా నాలుగు పెన్నులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ విధానంలో ఎటువంటి కోత, కుట్లు లేకుండా వైద్యులు ఈ అరుదైన శాస్త్ర చికిత్స చేశారు.
News July 7, 2025
బ్యాటింగ్, బౌలింగ్ అదరగొట్టారుగా..

రెండో టెస్టులో ఇంగ్లండ్పై గెలుపుతో గిల్ కెప్టెన్గా విజయాల ఖాతా తెరిచారు. ఎడ్జ్బాస్టన్లో భారత జట్టుకు ఇదే తొలి విజయం. ఈ మైదానంలో ఆడిన గత 8 మ్యాచుల్లో ఏడు ఓడిపోగా ఒక మ్యాచును డ్రా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో సిరాజ్, రెండో ఇన్నింగ్సులో ఆకాశ్ దీప్ ఆరేసి వికెట్లతో అదరగొట్టారు. అటు కెప్టెన్ గిల్ 430 పరుగులతో మరిచిపోలేని ప్రదర్శన చేశారు. జడేజా, పంత్, జైస్వాల్, రాహుల్ తమ వంతు పాత్ర పోషించారు.