News October 19, 2025

WGL: ఆసక్తి గలవారు వేసేశారు.. మిగిలింది ఎవరు.?

image

ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మద్యం వ్యాపారులు, కొత్తగా చేయాలనే వారు టెండర్ వేసేశారు. ఇక మిగిలింది ఎవరనే ప్రశ్న మొదలైంది. లైసెన్స్ దక్కించున్నాక వ్యాపారుల కష్టాలు అన్నీ ఇన్ని కావని చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.3 లక్షల ఫీజు చేసింది. ఏడాది ఫీజులో నగరాలకు రూ.10 లక్షలకు పెంచింది. ఇక ఏడాదికి రూరల్‌కు రూ.5.50 కోట్లు, అర్బన్‌కు రూ.8.50 కోట్లు అమ్మితే 20 శాతం కోటా పూర్తయితే 10 శాతం కమీషన్ ఇస్తారు.

Similar News

News October 21, 2025

తూర్పుగోదావరి జిల్లా నుంచి తొలి ఐపీఎస్‌ ఆయనే..!

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జన్మించిన పీవీ రంగయ్య నాయుడు జిల్లా నుంచి ఐపీఎస్‌కు ఎంపికైన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. 21 ఏళ్లకే ఆయన ఐపీఎస్ కావడం గమనార్హం. డీజీపీగా, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన సేవలు అందించారు. సర్వీస్ అనంతరం ఆయన రాజకీయాల్లో చేరి, ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర విద్యుత్, నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు.

News October 21, 2025

SRPT: ఠాణాపై దాడికి 17 ఏళ్లు.. ఇద్దరు పోలీసులు మృతి

image

తిరుమలగిరి ఠాణాపై నక్సల్స్ దాడి చేసి, ఇద్దరు పోలీసులను బలిగొన్న విషాద ఘటనకు 17 ఏళ్లు. 2007 జులై 7న సుమారు 40 మంది నక్సల్స్ ఠాణాపై దాడికి పాల్పడి, పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ శ్రీరాంరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ బడేసాబ్‌లపై కాల్పులు జరిపి వారిని చంపారు. అనంతరం స్టేషన్‌లో ఉన్న ఆయుధాలను అపహరించుకు పోయారు. ఆనాటి అమరవీరుల త్యాగాన్ని జిల్లా ప్రజలు స్మరించుకున్నారు.

News October 21, 2025

సూర్యాపేట ఘటనకు పదేళ్లు.. అమరులైన పోలీసులు

image

సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌ వద్ద 2015, ఏప్రిల్ 1న సిమీ ఉగ్రవాదులు పోలీసులపై జరిపిన కాల్పుల ఘటనకు నేటితో పదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ దారుణంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మెట్టు లింగయ్య, హోంగార్డు మహేష్ అక్కడికక్కడే మృతి చెంది అమరులయ్యారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటనను జిల్లా పోలీసులు, ప్రజలు నేటికీ మరువలేక అమరుల త్యాగాన్ని స్మరించుకుంటున్నారు.