News February 25, 2025
WGL: ఎత్తుకు పైఎత్తులు.. మిగిలింది ఒక్కరోజే!

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Similar News
News November 5, 2025
గూడెం: ఆలయంలో కార్తీక పౌర్ణమికి ఏర్పాట్లు పూర్తి

దండేపల్లి మండలంలోని పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకల కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు మంగళవారం సాయంత్రం తెలిపారు. మంచిర్యాల జిల్లా నుంచే కాకుండా కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రేపు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.
News November 4, 2025
యాదాద్రి: కార్తీక పౌర్ణమి వ్రతాలకు ప్రత్యేక ఏర్పాట్లు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం రేపు ఒక్కరోజు ఎనిమిది బ్యాచులుగా వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.
News November 4, 2025
మందమర్రి: ‘మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలి’

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ బోర్డు నిర్వహించకుండా కార్మికులను అయోమయానికి గురి చేస్తోందని టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు విమర్శించారు. అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సింగరేణి కుటుంబాల్లో వెలుగులు నింపిన దేవుడన్నారు. కారుణ్య నియామకాల ద్వారా 19 వేల ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణిలో కార్మికులకు ఉద్యోగ భద్రత కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు.


