News December 15, 2025

WGL: కాంగ్రెస్ 545, BRS 336, BJPకి 29 జీపీలు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయిగా ఉంది. మొదటి, రెండో దశలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 545 పంచాయతీలకు గెలువగా, బీఆర్ఎస్ 336, బీజేపీ 29, ఇతరులు 98 పంచాయతీలను గెలుచుకున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలిసారి బీజేపీ 29 జీపీలను గెలిచి తన ఖాతాను తెరవగా, మిగిలిన 3వ దశపై మూడు పార్టీలు గురి పెట్టాయి. బీఆర్ఎస్ రెండో విడతలో కాస్త మెరుగైన ఫలితాలనే సాధించింది.

Similar News

News December 18, 2025

శ్రీ సత్యసాయి జిల్లా ఇంఛార్జ్‌గా గ్రంధం చంద్రుడు

image

అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు జిల్లా ఇంఛార్జ్‌లుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు CS విజయానంద్ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా సత్యసాయి జిల్లా ఇంఛార్జ్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడును నియమించింది. గతంలో గంధం చంద్రుడు ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.

News December 18, 2025

కొండగట్టు అంజన్న సన్నిధిలో 100 గదుల నిర్మాణానికి TTD ఓకే..?

image

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో భక్తుల సౌకర్యార్థం 100 వసతి గదుల నిర్మాణానికి TTD బోర్డు తీర్మానం చేసినట్లు సమాచారం. గతంలో కొండగట్టు దర్శనానికి వచ్చిన సందర్భంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న సన్నిధిలో 100 గదుల నిర్మాణం చేపడతామని వాగ్దానం చేశారు. ఇదిలా ఉండగా తాజా అప్డేట్ గురించి టీటీడీ పాలకమండలి నుంచి తమకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదని ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు.

News December 18, 2025

సింహాచలం దేవస్థానంలో పది రోజులు ఆర్జిత సేవలు రద్దు

image

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ 20 నుంచి 29 వరకు పగల్ పత్తు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.సుజాత గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ తిరువీధి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉత్సవాల కారణంగా ఈ పది రోజుల పాటు నిత్యం జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు వెల్లడించారు.