News March 26, 2024
WGL: కాకతీయ మెడికల్ కాలేజ్లో బ్రెయిన్ ట్యూమర్ చికిత్స
కాకతీయ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరో సర్జరీ విభాగంలో మొట్టమొదటిసారిగా బ్రెయిన్ ట్యూమర్ చికిత్స చేశారు. హనుమకొండ జిల్లా ఉప్పల్ గ్రామానికి చెందిన బుర్ర స్వరూపకు బ్రెయిన్లో ట్యూమర్ ఏర్పడింది. దీంతో ఆమెకు తీవ్రమైన తలనొప్పి, నరాల బాధతో ఆసుపత్రిలో చేరగా న్యూరోసర్జరీ విభాగం హెచ్ఓడీ డా.సికందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సచిన్, వీరేష్ శస్త్రచికిత్స చేశారు.
Similar News
News October 1, 2024
WGL: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!
సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.
News October 1, 2024
వరంగల్: మార్కెట్లో పత్తి ధరల వివరాలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర తటస్తంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ. 7450 పలకగా… నేడు కూడా అదే ధర పలికింది. అలాగే ఈరోజు మార్కెట్ తరలిరాగా రూ. 6910 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గత వారంతో పోలిస్తే ధరలు పడిపోయాయని వ్యాపారులు తెలుపుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది.
News October 1, 2024
డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటిన నల్లబెల్లి వాసులు
నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో నల్లబెల్లి మండల వాసులు సత్తాచాటారు. నల్లబెల్లికి చెందిన మూటిక ప్రవళిక స్కూల్ అసిస్టెంట్ సైన్స్ విభాగంలో 2 వ ర్యాంకు, ఎస్జీటీ విభాగంలో 7 వ ర్యాంకు కొండ్లె వినయ్, 14వ ర్యాంకు రాయరాకుల రాజేష్, 54వ ర్యాంకు కొండ్లె నాగలక్ష్మి, నారక్క పేట నుండి 70వ ర్యాంక్ వైనాల రవి, 73వ ర్యాంకు అనుముల శ్రీలత డీఎస్సీ ఫలితాల్లో ర్యాంకులు సాధించారు. వీరిని బంధువులు అభినందించారు.