News March 13, 2025
WGL: క్రమంగా తగ్గుతున్న మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం మక్కలు (బిల్టి) క్వింటాకు రూ.2,310 ధర పలకగా.. బుధవారం రూ.2,305కి చేరింది. ఈరోజు మళ్లీ రూ.10 తగ్గి రూ.2,300కి పడిపోయింది. అలాగే సూక పల్లికాయ క్వింటాకి రూ.7,150 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Similar News
News March 14, 2025
PPM: ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 365 గైర్హాజరు

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు గురువారం 365 గైర్హాజరైనట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో 7,278 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 6,912 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 5,665 మంది జనరల్ విద్యార్థులకు గాను 5,493 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,613 ఒకేషనల్ విద్యార్థులకు 1,419 మంది పరీక్ష రాశారని చెప్పారు.
News March 14, 2025
భద్రాద్రి జిల్లాలో రేపటి నుంచే ఒంటి పూట బడులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా శనివారం(రేపటి) నుంచి ఒంటిపూట బడులు మొదలుకానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటో తరగతి నుంచి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒక్కపూట తరగతులను నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్స్ స్కూల్స్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒంటి పూట బడులు పక్కాగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు.
News March 14, 2025
దాదాపు రెండేళ్లకు ఓటీటీలోకి..

అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఏజెంట్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నిన్నటి నుంచి ఈ సినిమా సోనీ లీవ్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. కాగా అఖిల్ కొత్త మూవీ షూటింగ్ ఇవాళ్టి నుంచే ప్రారంభమవుతుందని సమాచారం.