News April 10, 2025
WGL: క్రమంగా పెరుగుతున్న పత్తి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,405 పలకగా.. మంగళవారం రూ.7,355, బుధవారం రూ.7,400 పలికాయి. అలాగే నేడు (గురువారం) మరింత పెరిగి రూ.7,425కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. ఈరోజు మార్కెట్కు పత్తి తరలిరాగా క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Similar News
News July 7, 2025
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 50 వేల ఉద్యోగాలు!

2025-26 ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వరంగ బ్యాంకులు దాదాపు 50 వేల మందిని రిక్రూట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. 21 వేల మంది ఆఫీసర్ల విభాగంలో కాగా, మిగిలినవి క్లర్కులు, ఇతర సిబ్బంది ఉద్యోగాలు ఉండనున్నాయి. ఈ నియామకాల్లో కేవలం SBI ఒక్కటే 20 వేల మందిని నియమించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5,500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 వేల మందిని నియమించుకునే అవకాశం ఉంది.
News July 7, 2025
భారత్లో ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’: మోదీ

రెస్పాన్సిబుల్ AIకోసం అన్ని దేశాలు కలిసి పనిచేయాలని PM మోదీ తెలిపారు. వచ్చే ఏడాది భారత్లో ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’ నిర్వహిస్తామన్నారు. ‘వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో భారత్ AIని సమగ్రంగా ఉపయోగిస్తోంది. ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. డిజిటల్ కంటెంట్ ప్రామాణికతను ధృవీకరించే గ్లోబల్ స్టాండర్డ్స్ తేవాలి. కంటెంట్ మూలం తెలిస్తే.. పారదర్శకత ఉండి, దుర్వినియోగాన్ని కట్టడి చేయొచ్చు’ అని పేర్కొన్నారు.
News July 7, 2025
కానిస్టేబుల్పై దాడి.. యోగి మార్క్ ట్రీట్మెంట్

UP: ఫిలిభిట్ జిల్లాలో హెడ్ కానిస్టేబుల్పై దాడి చేసిన కేసులో తండ్రి, ముగ్గురు కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహావీర్ ఫిర్యాదు ప్రకారం.. ఢాకా ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి మహావీర్ పెట్రోలింగ్ చేస్తున్నారు. ఓ గుంపును చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. వాళ్లు దాడి చేసి, యూనిఫామ్ చింపేశారు. వారికి పోలీసులు వారి మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే పోలీసులే దౌర్జన్యం చేశారని ఆ కుటుంబం ఆరోపిస్తోంది.