News July 7, 2025
WGL: క్వింటా పత్తి ధర రూ.7,550

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునఃప్రారంభమైంది. అయితే మార్కెట్కు పత్తి అంతంత మాత్రంగానే వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అయితే ధర మాత్రం భారీగానే పలికినట్లు చెప్పారు. గతవారం గరిష్ఠంగా క్వింటా పత్తి ధర రూ.7,565 నమోదవగా.. నేడు రూ.7,550కి చేరింది. ప్రస్తుతం పత్తి అందుబాటులో లేని సమయంలో ఇంత ధర పలకడం రైతులకు కొంత నిరాశ కలిగించే విషయం.
Similar News
News July 7, 2025
MHBD, కేసముద్రానికి డిప్యూటీ సీఎం, మంత్రులు రాక

ఈనెల 8న మహబూబాబాద్, కేసముద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు MLA మురళీ నాయక్ తెలిపారు. రూ.300 కోట్ల పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల కార్యక్రమానికి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వేం నరేందర్ రెడ్డిలు హాజరు కానునట్లు తెలిపారు. సభకు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
News July 7, 2025
దుర్గమ్మ అంతరాలయ, VIP దర్శనాలు నిలిపివేత

AP: ఈనెల 8-10 వరకు విజయవాడ దుర్గమ్మ అంతరాలయ, VIP దర్శనాలను నిలిపేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. శాకంబరీ ఉత్సవాలు, ఆషాఢ సారె సమర్పణ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. తూ.గో, ప.గో, కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు, వ్యాపారులు అమ్మవారి అలంకరణకు 150టన్నుల కూరగాయలు, 50టన్నుల పండ్లు స్వచ్ఛందంగా అందజేశారు.
News July 7, 2025
రికార్డులు బద్దలుకొట్టిన ముల్డర్

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ క్వాడ్రాపుల్ సెంచరీకి అవకాశమున్నా 367* రన్స్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. అయినా పలు రికార్డులు బద్దలుకొట్టారు. విదేశాల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. టెస్టుల్లో 350 రన్స్ చేసిన ఏడో ప్లేయర్గా నిలిచారు. ఒక టెస్టులో హయ్యెస్ట్ రన్స్ చేసిన సౌతాఫ్రికన్గా రికార్డు సొంతం చేసుకున్నారు.