News April 11, 2025
WGL: చిరుదాన్యాల ధరల వివరాలు….

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో నేడు (శుక్రవారం) చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా ధర రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.4,250 పలికింది. అలాగే పసుపు (కాడి) క్వింటా ధర రూ.13,659, పసుపు (గోల)కి రూ.12,689 వచ్చింది. మరోవైపు మక్కలు (బిల్టీ) క్వింటా ధర రూ.2,320 పలికినట్లు అధికారులు వెల్లడించారు. కాగా మక్కల ధర 2 రోజులతో పోలిస్తే పెరిగింది.
Similar News
News April 18, 2025
వరంగల్: భద్రకాళి చెరువులోని మట్టి కావాలా?

వరంగల్ భద్రకాళి చెరువు పూడికతీతలో భాగంగా నల్లమట్టి కావాల్సిన వారు నక్కలగుట్ట ఇరిగేషన్ సర్కిల్-2 కార్యాలయంలో సంప్రదించాలని ఈఈ శంకర్ తెలిపారు. ఒక క్యూబిక్ మీటరు మట్టికి రూ.71.83 డీడీ తీసి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇతర వివరాల కోసం సహాయ కేంద్రం నంబర్ 94406 38401ను సంప్రదించాలన్నారు. నల్లమట్టి పంట పొలాలకు ఎరువులా ఉపయోగపడుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 18, 2025
మన ‘ఓరుగల్లు’లో ఎన్నో చారిత్రక కట్టడాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయుల కాలంలో నిర్మించిన ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వేయి స్తంభాల గుడి, కాకతీయ కళా తోరణం, ఖిలా వరంగల్, కోటలు, పలు గ్రామాల్లో వారు నిర్మించిన శివాలయాలు, ఇతర దేవాలయాలు ఉన్నాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాగా, నేడు అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం.
News April 18, 2025
మామునూరు ఎయిర్పోర్టు.. నెక్స్ట్ ఏంటి?

మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. ఇందుకు 949ఎకరాలు అవసరమవగా 696ఎకరాలు సేకరించారు. మరో 253ఎకరాల కోసం 3గ్రామాలను ఒప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అక్కడి భూముల ధరలు అమాంతం పెరగడంతో ఎకరాకు రూ.5కోట్లు ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. దీంతో ఎయిర్పోర్టు అంశం పట్టాలు తప్పినట్లేనా అని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. సమస్యను క్లియర్ చేసి త్వరగా నిర్మించాలని కోరుతున్నారు.