News July 7, 2025

WGL: నేటి క్రమశిక్షణ కమిటీ సమావేశం వాయిదా

image

జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులపై సోమవారం HYD గాంధీభవన్‌లో నిర్వహించనున్న క్రమశిక్షణ కమిటీ సమావేశం వాయిదా పడింది. కొండా దంపతుల వ్యతిరేక వర్గంతో భేటీ కానున్న కమిటీ సమావేశాన్ని వాయిదా వేసింది. సోమవారం బల్దియాలో జరగనున్న కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో వరంగల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర నేతలు పాల్గొనాల్సి ఉంది. దీంతో ఈ సమావేశం ఈ నెల 10వ తేదీకి వాయిదా పడింది.

Similar News

News July 7, 2025

రేపే అరుణాచలం యాత్ర బస్సు ప్రయాణం: GDK – DM

image

కాణిపాకం, అరుణాచలం, జోగులాంబ, గోల్డెన్ టెంపుల్ వీక్షించే యాత్రికులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. మంగళవారం ఈ బస్సు ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తిగల భక్తులు బుకింగ్ కోసం 7013504982 ను సంప్రదించాలని కోరారు. ఈ యాత్రకు రాజధాని AC బస్సు సమకూర్చామన్నారు. ఛార్జీలు పెద్దలకు ₹5900, పిల్లలకు ₹4900గా నిర్ణయించామన్నారు.

News July 7, 2025

పామిడిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

పామిడిలోని జగన్నాథ పద్మావతి కన్వెన్షన్ హాల్‌లో సోమవారం కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

News July 7, 2025

శ్రీకాకుళం: గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా..రూట్ మ్యాప్ ఇదే

image

గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈనెల 9 ఉ.6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 వరకు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వచ్చు ప్రైవేటు ట్రావెల్ బస్సులు, RTC బస్సులు, ఇతర వాహనదారులు నగరంలోకి రాకుండా ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలని సూచించారు.