News September 30, 2024
WGL: నేటి నుంచి టీచర్ ఓటర్ల నమోదు ప్రక్రియ

వరంగల్-నల్గొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానం కాల పరిమితి మార్చి-29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎలెక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 108-భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి మండలానికి సంబంధించిన టీచర్ ఓటర్ల నమోదు ప్రక్రియ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుందని తహశీల్దార్ తెలిపారు. కావున అర్హులయిన టీచర్లు అందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలిపారు.
Similar News
News December 24, 2025
వర్ధన్నపేట: ఏటీఎంలో కేటుగాడు

వర్ధన్నపేట ఎస్బీఐ బ్యాంకు ఏటీఎం వద్ద రైతు పిన్నింటి కిషన్రావు మోసానికి గురయ్యాడు. నగదు తీసుకునేందుకు వెళ్లిన సమయంలో దుండగుడు అతని ఏటీఎం కార్డును మార్చి రూ.40 వేల నగదు కాజేశాడు. గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మోసగాడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
News December 24, 2025
వరంగల్ ఎక్సైజ్ శాఖలో పదోన్నతులు

వరంగల్ డివిజన్ వ్యాప్తంగా 8 మంది ఎస్సైలకు సీఐగా పదోన్నతి కల్పించేందుకు డీపీసీ సిఫారసులను కమిషనర్ సి.హరికిరణ్ ఆమోదించారు. రోస్టర్ ప్రకారం రమాదేవి, రజిత, చంద్రశేఖర్, జ్యోతి, సరిత, అశోక్కుమార్ తదితరులకు గ్రీన్సిగ్నల్ లభించింది. అలాగే శ్రీనివాస్రెడ్డి, మురళి ఎక్సైజ్ సూపరింటెండెంట్లుగా, అంజన్రావు జాయింట్ కమిషనర్గా పదోన్నతి పొందారు. జీవో విడుదల అనంతరం పోస్టింగ్లు ఇవ్వనున్నారు.
News December 21, 2025
జాతీయ కరాటే పోటీల్లో వర్ధన్నపేట బాలుడికి స్వర్ణం

భోపాల్లో నిర్వహించిన 16వ నేషనల్ WFSKO ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్-2025లో వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఎం.మహాజన్ ఉపేంద్ర బంగారు పతకం సాధించాడు. పుస్కోస్ పాఠశాలలో చదువుతున్న ఉపేంద్ర, 10 ఏళ్ల లోపు బాలుర విభాగంలో దేశవ్యాప్తంగా వచ్చిన వందలాది మంది క్రీడాకారులతో తలపడి అద్భుత నైపుణ్యంతో ఈ విజయాన్ని అందుకున్నాడు. జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించిన ఉపేంద్రను పాఠశాల యాజమాన్యం అభినందించింది.


