News May 7, 2024
WGL: పట్టభద్రుల ఎన్నికకు 22 మంది నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు నామినేషన్ వేసిన అభ్యర్థుల సంఖ్య 22కు చేరిందని అధికారులు తెలిపారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా, జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, BRS నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి పోటీ చేస్తుండగా, బిజెపి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.
Similar News
News October 3, 2024
జనసంద్రమైన వేయి స్తంభాల ఆలయ పరిసర ప్రాంతాలు
HNK జిల్లా కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల సందర్భంగా వేయి స్తంభాల ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. హనుమకొండ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు.
News October 3, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్
> BHPL: రంగయ్యపల్లిలో పిడుగు పడి మహిళా రైతు మృతి
> MHBD: గుట్టకింది తండాలో పిడుగు పడి ఒకరికి గాయాలు
> HNK: అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
> KZP: సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు
> HNK: పిడుగు పడి ఇద్దరు మృతి
> JN: కే-వీల్స్ దొంగతనం చేసిన వ్యక్తి అరెస్ట్
> MHBD: దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు
> HNK: మహిళతో సహా ముగ్గురు దోపిడీ దొంగల అరెస్ట్
> WGL: బాధితుడికి పోగొట్టుకున్న ఫోన్ అందజేత
News October 2, 2024
బతుకమ్మను ఎత్తుకున్న ఎంపీ కడియం కావ్య
హనుమకొండ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. బతుకమ్మను ఎంపీ కడియం కావ్య ఎత్తుకొని కాసేపు బతుకమ్మ ఆడి సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని, బతుకమ్మ పండుగ వేడుకల్లో తొలిసారి ఎంపీగా పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు.