News July 18, 2024

WGL: పతనమైన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు పతనమవుతూ వస్తుంది. ఈ క్రమంలో గత రెండు రోజులతో పోలిస్తే పత్తి ధర ఈరోజు తగ్గింది. సోమవారం రూ.7,310 పలికిన క్వింటా పత్తి.. మంగళవారం రూ.7,350కి చేరింది. నిన్న మార్కెట్ బంద్ ఉండగా.. ఈరోజు ప్రారంభమై రూ.7,235కి పడిపోయింది. దీంతో రైతన్నలు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

Similar News

News February 8, 2026

పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు: వరంగల్ కలెక్టర్

image

ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బాధ్యతగా పని చేయాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆదివారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్‌ను ఆమె పరిశీలించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

News February 8, 2026

వరంగల్: మల వ్యర్థాలు బహిరంగంగా వేస్తే జైలుకే!

image

మల వ్యర్థాలను బహిరంగంగా పారబోస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం శానిటేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో సానిటరీ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేయాలని స్పష్టం చేశారు.

News February 7, 2026

వరంగల్: ఉపాధి పనులు ముమ్మరం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను ప్రారంభించి, కూలీలకు నిరంతర ఉపాధి కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం ఎంపీడీవోలు, ఏపీవోలతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఎక్కువ మంది కూలీలు పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల పురోగతిలో నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో రాంరెడ్డి పాల్గొన్నారు.