News August 24, 2025
WGL: పాక్స్ డైరెక్టర్ ఇంట్లో యూరియా బస్తాలు లభ్యం

రాయపర్తి మండలం తిర్మలాయపల్లిలో PACS డైరెక్టర్ దొంతరబోయిన యాదగిరి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 26 యూరియా బస్తాలను వ్యవసాయ అధికారులు సీజ్ చేశారు. రాయపర్తి ఏవో వీరభద్రం ఆధ్వర్యంలో నమ్మదగిన సమాచారంతో తనిఖీలు చేయగా బస్తాలు లభించాయి. యాదగిరిపై బీఎన్ఎస్ 6ఏ కింద కేసు నమోదు చేశారు. యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ డైరెక్టర్ ఇంట్లో అక్రమ నిల్వలు కలకలం సృష్టించాయి.
Similar News
News August 24, 2025
అప్పుడు ఊరికి ఓ గణపతి.. నేడు వీధికొకటి!

ఇరవై ఏళ్ల కిందట వినాయక చవితికి ముందు 3రోజులు, ఆ తర్వాత నిమజ్జనం దాకా గ్రామాల్లో సందడి మామూలుగా ఉండేది కాదు. చందాలు సేకరించి ఊరంతటికీ కలిపి ఓ విగ్రహాన్ని సెలక్ట్ చేయడం, మండపాల నిర్మాణం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు అని ప్లాన్ చేసేవాళ్లు. కానీ ఆ తర్వాత వీధికొక విగ్రహం ఏర్పాటు చేస్తుండటం వల్ల ఊరంతా కలిసి సంబరాలు చేసుకొనే కల్చర్ మాయమవుతోందని ముఖ్యంగా 90’s కిడ్స్ ఫీలవుతున్నారు. మీ COMMENT.
News August 24, 2025
బీసీ రిజర్వేషన్లు.. గాంధీభవన్ కీలక నిర్ణయం ?

రాష్ట్రంలో ఇపుడు ఎక్కడ చూసినా 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనే సాగుతోంది. ఈ నేపథ్యంలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నిర్ణయంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ సీటును బీసీ అభ్యర్థికి కేటాయించి బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రజలకు చెప్పకనే చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఈ విషయంపై పార్టీ అధిష్ఠానం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
News August 24, 2025
కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్: కలెక్టర్

సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి అధికారులు హాజరవుతారు. అర్జీలు, పాత స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. పరిష్కారం అయిన వెంటనే మెసేజ్ వస్తుందని చెప్పారు. కాల్ సెంటర్ 1100 లేదా meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని కోరారు.