News December 19, 2025
WGL: పెద్ద పంచాయతీలు హస్తానివే..!

మేజర్ పంచాయతీలు అధికార పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఉమ్మడి జిల్లాలోని 33 మండల కేంద్రాల్లో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులు గెలవగా, 17 చోట్ల BRS బలపరచిన అభ్యర్థులు విజయం సాధించారు. అనూహ్యంగా BJP సైతం HNK జిల్లాలోని కమలాపూర్, భీమదేవరపల్లి మండలాల్లో హవా చాటింది. జనగామ(M) వెంకిర్యాల, దామెర(M) కోగిల్వాయి, ఐనవోలు(M) పంతినిని తన ఖాతాలోకి వేసుకుంది. ఇదిలా ఉంటే స్వతంత్రులు సైతం ఏడు పెద్ద పంచాయతీల్లో పాగా వేశారు.
Similar News
News December 26, 2025
‘ఇండియా నన్ను బాగు చేసింది’.. NRI పోస్ట్ వైరల్

తన అనారోగ్యాన్ని ఇండియా నయం చేసిందని ఓ NRI చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘పదేళ్ల క్రితం US వెళ్లా. డేటా సైంటిస్టుగా పని చేస్తుండగా schizoaffective డిజార్డర్ (మానసిక వ్యాధి) ఉన్నట్లు 2018లో తేలింది. US హెల్త్ కేర్ సిస్టమ్ నన్ను భయపెట్టింది. దీంతో 2024లో ఇండియాకు వచ్చా. ఇప్పుడు నాకు నయమైంది. ఇక్కడి హెల్త్ సిస్టమ్, డాక్టర్ల వల్లే ఇది సాధ్యమైంది. నన్ను మనీ మెషీన్లుగా చూడలేదు’ అని రెడిట్లో రాసుకొచ్చారు.
News December 26, 2025
కేయూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు 940మంది రిజిస్ట్రేషన్

కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాలు ఈనెల 27, 28 తేదీల్లో హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 4న ప్రారంభమైన ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి పూర్వ విద్యార్థులు తరలివస్తుండగా 940 మంది రిజిస్ట్రేషన్ చేశారు. 27న ప్రారంభ సమావేశం, 28న పూర్వ విద్యార్థుల సమావేశం, ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు.
News December 26, 2025
హనుమకొండ: భార్య గొంతు కోసిన భర్త

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పరకాల మండలం మలకపేట సోషల్ వెల్ఫేర్ స్కూల్లో అటెండర్గా పనిచేస్తున్న మంద అనూష(35)ను ఆమె భర్త రవి కత్తితో గొంతు కోసిన ఘటన చోటు చేసుకుంది. అనూషను స్థానికులు హనుమకొండ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


