News December 15, 2025
WGL: బ్యాలెట్ పేపర్ ఓటు వినియోగంలో తప్పిదాలు!

ఉమ్మడి జిల్లాలో 2వ దశ పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ విధానంతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో చిత్ర విచిత్ర విషయాలు వెలుగులోకొస్తున్నాయి. వృద్ధులకు ఓటు ఎలా వేయాలో తెలియలేదట. యువత సైతం కొంత మంది ఇదే తోవలో నడిచారు. బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ బదులు వేలి ముద్ర వేయడం, గుర్తుపై కాకుండా మడత పెట్టీ ఇచ్చిన పేపర్పై స్వస్తిక్ వేయడం, కొంత మంది రెండు బ్యాలెట్ పేపర్లు ఇస్తే ఒకటే వేసి మరొకటి జేబులో పెట్టుకున్నారట.
Similar News
News December 15, 2025
ఇది రేవంత్కు చెంపపెట్టు.. ప్రజాగ్రహానికి సంకేతం: KTR

TG: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతుందని KTR అన్నారు. ‘రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ BRS అద్వితీయ ఫలితాలు సాధించింది. కాంగ్రెస్ మంత్రుల, MLAల నియోజకవర్గాల్లోనూ సత్తా చాటింది. అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్కు ఇక కాలం చెల్లిందని ప్రజలు ఓటుతో మరోసారి తేల్చిచెప్పారు. ఈ ఫలితాలు రేవంత్కు చెంపపెట్టు. INC సగం స్థానాలను కూడా గెలవకపోవడం ప్రజాగ్రహానికి సంకేతం’ అని ట్వీట్ చేశారు.
News December 15, 2025
ముస్తాబాద్: యంత్రాలతో వరిగడ్డి కట్టలు.. రూ. 40 వేలు ఆదా

ముస్తాబాద్ ప్రాంతంలో వరి నూర్పిడి తర్వాత పొలాల్లోని ఎండుగడ్డిని తగులబెట్టడం వల్ల కాలుష్యం, భూసారం నష్టం జరుగుతున్నప్పటికీ 75 శాతం మంది రైతులు అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. అయితే, కొందరు రైతులు యంత్రాల సహాయంతో వరిగడ్డిని కట్టలుగా చేసి, పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా రైతులు సుమారు రూ.40 వేల వరకు ఖర్చు ఆదా చేసుకుంటున్నారు. ఇది పర్యావరణానికి, రైతులకు లాభదాయకమని అధికారులు పేర్కొన్నారు.
News December 15, 2025
క్రమంగా పుంజుకుంటోన్న అరటి ధరలు

AP: గత నెలలో కిలో రూ.2కు పడిపోయిన అరటి ధరలు.. ఉత్తరాది వ్యాపారుల కొనుగోలుతో ఇప్పుడు పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం కిలో అరటి ధర కనీసం రూ.10, గరిష్ఠంగా రూ.16, రూ.17గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో అరటి సాగు పెరగడం, తక్కువ ధరకే నాణ్యమైన అరటి లభించడంతో ఉత్తరాది వ్యాపారులు అక్కడి సరుకునే కొనడంతో.. ఏపీలో అరటి ధర భారీగా పతనమై ఢిల్లీ, ముంబై, కోల్కతాలకు ఎగుమతి నిలిచింది.


