News July 8, 2025
WGL: మహిళలకు గుడ్ న్యూస్.. రూ.18కోట్లు మంజూరు

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల్లో రుణాలు తీసుకున్న సభ్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రుణాలకు సంబంధించిన వడ్డీని మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి సెర్ప్ పరిధిలో రూ.18 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మహిళా శక్తి సంబరాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను మహిళల ఖాతాల్లో జమ చేయనుంది. వడ్డీ నిధులను మంజూరు చేయడం పట్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Similar News
News July 8, 2025
సభ్యత్వం తీసుకునేలా కృషి చేయాలి: కలెక్టర్

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మంగళవారం కామారెడ్డి మండల సమాఖ్య ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తిలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళా సంఘంలో సభ్యత్వం తీసుకునేలా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. బ్యాంకు లింకేజీ లక్ష్యాన్ని 100% పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు.
News July 8, 2025
సిరాజ్కు రెస్ట్.. బుమ్రా ఎంట్రీ!

ఇంగ్లండ్తో ఎల్లుండి ప్రారంభం కానున్న మూడో టెస్టుకు స్టార్ బౌలర్ సిరాజ్కు రెస్ట్ ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు, మూడో టెస్టుకు మధ్యలో మూడు రోజులే గ్యాప్ వచ్చింది. దీంతో తొలి టెస్టులో 41 ఓవర్లు, రెండో దాంట్లో 32 ఓవర్లు వేసిన సిరాజ్పై వర్క్లోడ్ పడొద్దని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే అతని స్థానంలో బుమ్రాను తీసుకోనున్నట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి.
News July 8, 2025
ఆంధ్రా TO భైంసా.. కిలో రూ.50

నిర్మల్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్రలో ప్రతికూల పరిస్థితుల మూలంగా టమాటా సాగు తగ్గిపోయింది. వంటింట్లో ఏది వండాలన్న అందులో ముఖ్యంగా టమాటా అవసరమే. దిగుబడులు లేకపోవడంతో వ్యాపారులు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి తీసుకొచ్చి భైంసాలో చిరు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్లో కిలో టమాటా ధరలు పెరిగి కిలో రూ. 50 పలుకుతోంది.