News October 16, 2025

WGL: ముందు ఇన్‌ఛార్జి పదవి పాయే..!

image

తెలంగాణలో మంత్రుల కీచులాట తారాస్థాయికి చేరింది. మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా కొనసాగిన కొండా సురేఖ.. అక్కడి వారి ఫిర్యాదుతో ఆ పదవి పోయింది. ప్రస్తుతం ఏ జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రి పోస్టు లేకుండా ఉండిపోయారు. ఓఎస్డీ డిస్మిస్, అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల ప్రయత్నం.. ప్రభుత్వం పైనే తిరుగుబాటు చేసే వరకు వెళ్లింది. మరోపక్క ఆమె మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమైనట్లు అనుచురులు చర్చించుకుంటున్నారు.

Similar News

News October 16, 2025

పవన్ అపాయింట్మెంట్ కోసం వినుత వెయిటింగ్!

image

DCM పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం వినుత కోట దంపతులు ఎదురు చూస్తున్నారట. తనకు జరిగిన అన్యాయంపై పూర్తి ఆధారాలు అధినేత వద్ద చేర్చేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. వారం రోజులవరకు వేచి చూసి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మీడియా ముందుకు ఆ ఆధారాలు బయట పెడుతారని వినుత వర్గీయుల మధ్య చర్చ సాగుతోంది.

News October 16, 2025

వరదలతో భవానీ ఐలాండ్ టూరిజానికి రూ.1.8 కోట్ల నష్టం

image

కృష్ణా నదికి వచ్చిన వరదలతో విజయవాడ భవానీ ఐలాండ్ మూతపడింది. దాదాపు 60 రోజులపాటు టూరిస్టులు రాకపోవడంతో బోటింగ్‌కు రూ.1.5కోట్లు, బరంపార్కులో కొన్ని ఫంక్షన్లు రద్దు కావడం, టూరిస్టులు రాకపోవడంతో రూ.30 లక్షల వరకు నష్టం వచ్చినట్లు అధికారిక వర్గాల సమాచారం. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో మూడు రోజుల నుంచి టూరిస్టుల రాక పెరగడంతో బోటింగ్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రూ.1.40 లక్షల ఆదాయం రోజుకు వస్తోంది.

News October 16, 2025

మక్తల్: దొంగల దాడి.. ఇంటి యజమానికి గాయాలు

image

మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగార్లపల్లిలో గురువారం అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి మహిళ మెడలోని పుస్తెలతాడు లాక్కోవడానికి యత్నించారు. అడ్డుకున్న ఇంటి యజమాని అంజిలప్పను రాడ్‌తో దెబ్బకొట్టి గాయపరిచారు. ఆ మహిళ అరుపులు కేకలు వేయడంతో గ్రామస్థులు పరుగున చేరుకునే లోపు ముగ్గురిలో ఇద్దరు దొంగలు పరారయ్యారు. ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.