News December 29, 2025

WGL: రాంకీ ఇన్ ఫ్రాలో 102 ఎల్ఐజీ ఫ్లాట్లు

image

వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో అల్పాదాయ వర్గాల కోసం ఎల్‌ఐజీ 102 ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చినట్లు హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజినీర్ సి.వి.రమణారెడ్డి, కార్యదర్శి ఎస్.విమల తెలిపారు. కొనుగోలు ఆసక్తి ఉన్న వారు జనవరి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫ్లాట్లను 8న లాటరీ విధానంలో కేటాయిస్తామని అన్నారు. ఈ ఫ్లాట్ల గూర్చి రాంకీ ప్రాజెక్టు సైట్ వద్ద మంగళవారం అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారని అన్నారు.

Similar News

News December 31, 2025

MHBD: తండ్రి డబ్బులివ్వలేదని కొడుకు ఆత్మహత్య

image

నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలో విషాదం నెలకొంది. తండ్రి డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో కొడుకు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై రమేశ్ బాబు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రాకేష్ తన తండ్రి సంతోష్‌ను రూ.లక్ష అడిగాడు. ప్రస్తుతం తన వద్ద లేవని, రేపు ఇస్తానని తండ్రి చెప్పడంతో క్షణికావేశానికి లోనైన రాకేష్ పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

News December 31, 2025

అమరావతి జిల్లా లేనట్లేనా.?

image

అమరావతి జిల్లాగా మారుతుందని ఎంతగానో ఎదురుచూసిన వారి ఆశలు అడియాసలుగా మారాయి. APలో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటుకు, సోమవారం క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా డిసెంబర్ 31 నుంచి 2 కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయి. కొత్త ఏడాది తర్వాత ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ముందుగా భావించినప్పటికీ.. ముందే ఏర్పాటును అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో అమరావతి జిల్లా కలగానే మిగిలిందంటున్నారు.

News December 31, 2025

2025 క్రైమ్ రిపోర్టు: హత్యలు 54, కిడ్నాప్‌లు 25

image

శ్రీ సత్యసాయి జిల్లాలో 2025లో మొత్తం 4,028 కేసులు నమోదయ్యాయని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే నేరాలు 2 శాతం పెరిగాయని చెప్పారు. రోడ్డు ప్రమాద మరణాలు 340 నుంచి 303కు తగ్గాయి. హత్యలు 54, కిడ్నాప్‌లు 25గా నమోదయ్యాయి. మహిళలపై నేరాలు 26.3 శాతం పెరిగాయి. ఈ-చలాన్ల ద్వారా రూ.1.01 కోట్ల జరిమానా వసూలు చేశారు. హిందూపురం బ్యాంకు చోరీ కేసులో రూ.5.5 కోట్ల బంగారాన్ని పోలీసులు <<18718838>>రికవరీ<<>> చేశారు.