News March 18, 2025

WGL: రైతులకు గుడ్ న్యూస్.. పెరిగిన పత్తి ధర..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా పెరిగింది. సోమవారం పత్తి ధర క్వింటాకి రూ.6,825 ధర పలకగా.. మంగళవారం రూ.6,975కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధరలు మరింత పెరగాలని ఆకాంక్షిస్తున్నారు.

Similar News

News November 16, 2025

కొనుగోలు కేంద్రాల్లో 4983 మెట్రిక్ టన్నుల ధాన్యం: కలెక్టర్

image

జిల్లాలో ఏర్పాటు చేసిన 185 వరిధాన్యం కొనుగోలు కేంద్రాకు నేటి వరకు 4983.920 మెట్రిక్ టన్నులధాన్యం చేరుకున్నట్లు ములుగు కలెక్టర్ దివాకర్ టిఎస్ వెల్లడించారు. ఇందులో 17%తేమతో 2263.840 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 2151.480 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేశామని, 112.360 మెట్రిక్ టన్నుల కొనుగోలు ధాన్యం కేంద్రాల్లో నిల్వ ఉందన్నారు. రూ.1.37 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.

News November 16, 2025

ములుగు: కలహాల కాపురం.. దంపతులను కలిపిన న్యాయస్థానం..!

image

ములుగు జిల్లా బండారుపల్లికి చెందిన రాజ్ కుమార్, హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన ప్రియాంకకు ఏడాదిక్రితం వివాహమైంది. ఆరు నెలలు గడవక ముందే మనస్పర్థలు పొడచూపాయి. ఇరువురూ కోర్టును ఆశ్రయించారు. న్యాయవాది రంగోజు బిక్షపతి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో మనసు మార్చుకున్నారు. ములుగు జిల్లా కోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో న్యాయమూర్తి కన్నయ్యలాల్ ఎదుట దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. అడ్వకేట్‌ను అందరూ అభినందించారు.

News November 16, 2025

నవంబర్ 16: చరిత్రలో ఈరోజు

image

* 1966: జాతీయ పత్రికా దినోత్సవం * 1908: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి జననం. * 1923: తెలుగు సినీ నటుడు కాంతారావు జననం.(ఫొటోలో) * 1963: భారతీయ సినీ నటి మీనాక్షి శేషాద్రి జననం. * 1973: తెలుగు, తమిళ సినీ నటి ఆమని జననం. * 1973: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జననం. * 1983: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ జననం (ఫొటోలో).