News November 13, 2025
WGL: వండర్ హాట్ మిర్చి రూ.19,500

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో బుధవారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు పెరిగాయి. 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.18,300 ధర రాగా.. నేడు రూ.18,700 అయింది. వండర్ హాట్ (WH) మిర్చి నిన్న రూ.17,500 పలికితే.. ఈరోజు రూ.19,500 అయింది. తేజ మిర్చికి నిన్న రూ. 14,900 ధర వస్తే.. ఇవాళ రూ.14,650 ధర వచ్చింది. అలాగే దీపిక మిర్చి నిన్న రూ.15, 500 పలకగా ఈరోజు రూ.16,500 అయింది.
Similar News
News November 13, 2025
భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్టు: సీఐ

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో భార్య రత్నమ్మపై హత్యాయత్నం చేసిన ఆమె <<18270800>>భర్త<<>> ఎర్రి స్వామిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బుధవారం రాత్రి ఎర్రి స్వామి కత్తితో రత్నమ్మ గొంతు కోయడానికి యత్నించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు రూరల్ సీఐ హరినాథ్ తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
News November 13, 2025
వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు 2026-27కు అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా సమాచార అధికారి కె.జయమ్మ తెలిపారు. గత అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల 30తో ముగుస్తుందన్నారు. కొత్త దరఖాస్తులు రేపటి నుంచి https://mediarelations.ap.gov.in వెబ్సైట్లో ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు.
News November 13, 2025
జోడుగుళ్లపాలెం సముద్ర తీరంలో మృతదేహం

ఆరిలోవ స్టేషన్ పరిధి జోడుగుళ్లపాలెం బీచ్కు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం ఉదయం కొట్టుకొచ్చిందని పోలీసులు తెలిపారు. మృతుని వయస్సు సుమారు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని.. రెండు చేతుల మీద పచ్చబొట్లు ఉన్నాయని చెప్పారు. మృతుడిని ఎవరైనా గుర్తుపడితే ఆరిలోవ పోలీసులకు తెలియజేయాలని సీఐ మల్లేశ్వరరావు కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించామన్నారు.


