News December 26, 2025

WGL: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

image

జిల్లాలోని చెన్నారావుపేట మండలం లింగాపురంలో పల్నాటి సబిత (35) విద్యుత్ షాక్‌తో శుక్రవారం మరణించారు. తాను నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇంటికి నీరు పడుతుండగా, విద్యుత్ మోటర్ ఆగిపోయింది. దానిని సరి చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సబిత భర్త లింగమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ రెడ్డి తెలిపారు.

Similar News

News January 9, 2026

దైవాన్ని ఎలా నమస్కరించాలంటే?

image

గుడికి వెళ్లినప్పుడు దేవుడికి ఎలా నమస్కరించాలో శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. చాలామంది గర్భాలయంలోని మూలమూర్తికి ఎదురుగా నిలబడి దండం పెట్టుకుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఒక పక్కకు నిలబడే వేడుకోవాలి. గర్భాలయంలో అర్చకులు కుడివైపున ఉండి పూజలు చేస్తారు కాబట్టి, భక్తులు ఎడమ పక్కన నిలబడిటం మంచిది. అలాగే స్వామికి ఎదురుగా ఉండే నంది, గరుత్మంతుడికి మధ్యలో అడ్డుగా నిలబడకూడదని పండితులు చెబుతుంటారు.

News January 9, 2026

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో 97 పోస్టులకు నోటిఫికేషన్

image

<>ఇన్‌కమ్<<>> ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ముంబై రీజియన్‌లో స్పోర్ట్స్ కోటాలో 97 స్టెనోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్ , MTS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు JAN 31 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్నేషనల్, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ, రాష్ట్ర స్థాయి, ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్‌లో పతకాలు సాధించినవారు అర్హులు. వెబ్‌సైట్: www.incometaxmumbai.gov.in

News January 9, 2026

జనగామ: ప్రభుత్వ ఖజానాకు రూ.8 లక్షల గండి!

image

జిల్లాలో 10 డాక్యుమెంట్లలో రూ.8 లక్షలకు పైగా ప్రభుత్వ ఖజానాకు మీ సేవా సెంటర్లు కుచ్చు టోపీ పెట్టారు. స్థానిక తహశీల్దారు కార్యాలయంలో యథేచ్ఛగా కొన్ని రోజులుగా ఈ దందా కొనసాగుతోంది. ఓ జర్నలిస్టుకు చెందిన డాక్యుమెంట్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని జిల్లాల్లోనూ <<18805930>>ఇదే తరహాలో మోసాలు <<>>జరిగాయని పోలీసులు చెబుతున్నారు.