News January 30, 2025
WGL: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

నిన్న అమావాస్య సందర్భంగా బంద్ ఉన్న వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి తరలి వచ్చింది. అయితే మంగళవారంతో పోలిస్తే ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.6,940పలకగా.. నేడు రూ.7,010కి చేరినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా గతవారం రూ. 7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది.
Similar News
News November 7, 2025
వందేమాతర 150వ సంవత్సరోత్సవం: పెద్దపల్లి కలెక్టర్

వందేమాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి కావడం సందర్భంగా ఈనెల 7వ తేదీ ఉదయం 9:45 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
News November 7, 2025
కట్టెల పొయ్యిపై వంట చేస్తే చర్యలు: వనపర్తి కలెక్టర్

జిల్లాలోని మధ్యాహ్నం భోజనం అందించే ప్రభుత్వ పాఠశాలలకు కలెక్టర్ నిధుల నుంచి LPG సిలిండర్లు ఇప్పించడం జరుగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సిలిండర్ తీసుకున్న తర్వాత కట్టెల పొయ్యిపై వంట చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు సిలిండర్ అందని పాఠశాలలను గుర్తించి వెంటనే సిలిండర్ అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
News November 6, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: పెద్దపల్లి కలెక్టర్

మంథని నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్కింగ్ చేసిన ఇళ్లు, బేస్మెంట్ స్థాయికి చేరుకునేలా పనులు వేగవంతం చేయాలని, నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లు రద్దు చేయాలని ఆదేశించారు. పెట్టుబడి సమస్యలుంటే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించాలని సూచించారు. నిర్మాణ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.


