News February 16, 2025
WGL: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
Similar News
News November 10, 2025
చిత్తూరు: సమస్యల పరిష్కారానికి వినతులు

పీజీఆర్ఎస్లో వచ్చే ఫిర్యాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. పెద్దపంజాణి మండలానికి చెందిన లక్ష్మీదేవి వన్ బీ కోసం, బొమ్మసముద్రం చెందిన భువనేశ్వరి వితంతు పింఛన్ కోసం, పీసీ గుంటకు చెందిన గుర్రప్ప పట్టాదారు పాసు పుస్తకం కోసం వినతి పత్రాలు ఇచ్చారు. మొత్తం 301 ఫిర్యాదులు వచ్చాయి.
News November 10, 2025
మంచిర్యాల: రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

2026-26 సం.నికి ధాన్యం కొనుగోలు జిల్లాలో పూర్తిస్థాయి ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతుల సౌకర్యం కోసం కంట్రోల్ రూమ్ నం.6303928682 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో 1967, 180042500333 నంబర్లకు సంప్రదించాలన్నారు.
News November 10, 2025
ములుగు: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల వివరాలు

జిల్లాలో 2025-26కు గాను నూతన కొనుగోలు కేంద్రాలు 185 ఏర్పాటు చేశామని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. మొత్తం 1,722 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, 17% తేమతో 578, మిల్లుకు రవాణా చేసిన ధాన్యం 578 మెట్రిక్ టన్నులని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు 1,843 టార్పాలిన్, 5,35,248 ఖాళీ బస్తాలు సరఫరా చేశామన్నారు. ఇంకా 1,857 టార్ఫాలిన్, 22,96,557 ఖాళీ బస్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు.


