News January 14, 2026
WGL: 260 వార్డులు, 3,35,244 మంది ఓటర్లు!

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారాకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. ఆరు జిల్లాల పరిధిలో ఉన్న 12 మున్సిపాలిటీల్లోని 260 వార్డులకు సంబంధించి జాబితాను ఖరారు చేశారు. మొత్తం 3,35,244 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముసాయిదాపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈ తుది జాబితాను వెల్లడించడంతో ఎన్నికల కసరత్తు వేగవంతమైంది.
Similar News
News February 15, 2026
తిరుపతి స్విమ్స్లో ఉద్యోగాలు

తిరుపతి స్విమ్స్లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మెడికల్ ఆఫీసర్లు-4, స్టాఫ్ నర్సులు-4, ఏఎన్ఎం-4, మమోగ్రఫీ టెక్నీషియన్-2, కార్డియో వాస్క్యలర్ టెక్నీషియన్ గ్రేడ్-2, డీఏవో-2, పీఆర్వో-2, మెడికో సోషల్ వర్కర్-2, ఎలక్ట్రీషియన్62, డ్రైవర్లు-2 పోస్టులు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు svimstpt.ap.nic.in వెబ్సైట్ చూడాలి.
News February 15, 2026
మన్యంకొండలో శేష వాహన సేవ

మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రాత్రి శేష వాహన సేవ ఘనంగా నిర్వహించారు. స్వామివారిని గర్భాలయం నుంచి దక్షిణ కట్ట వరకు మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, అలహరి రామకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు.
News February 15, 2026
NZB: 500 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం

నిజామాబాద్ నగరంలో ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందన ఈ దేవాలయంలోని శివలింగం స్వయంభూగా భావిస్తారు. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగం నిత్యం విశేష పూజలందుకుంటుంది. రథసప్తమి రోజున సూర్య కిరణాలు నేరుగా శివలింగంపై పడటం ఇక్కడి ప్రత్యేకత. శివరాత్రి పర్వదినాన్ని ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు.


