News March 27, 2025
WGL: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం WGL, HNK, MLG, JN, BHPL, MHBD డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
Similar News
News April 21, 2025
పదో తరగతి ఫలితాలు.. డేట్ ఫిక్స్

AP: పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలపై ఉత్కంఠ వీడింది. రిజల్ట్స్ ఈ నెల 23న (బుధవారం) ఉ.10 గంటలకు విడుదల చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మీకెంతో ఇష్టమైన Way2News యాప్ ద్వారా వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. కేవలం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో మార్క్స్ లిస్ట్ వస్తుంది. ఒక్క క్లిక్తో షేర్ చేసుకోవచ్చు. ఎలాంటి యాడ్స్ ఉండవు.
News April 21, 2025
రాజస్థాన్ రాయల్స్పై అంబటి రాయుడు తీవ్ర విమర్శలు

రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లోనూ విఫలం కావడంపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ప్రతి సీజన్లోనూ యువ ఆటగాళ్లపై RR పెట్టుబడి పెడుతోంది. IPL అంటే ఛారిటీయా? దాని వల్ల ఏం సాధించింది? పైగా అదేదో తమ బలంలా ఆ జట్టు యాజమాన్యం గొప్పగా చెప్పుకుంటోంది. టోర్నీ ఆడేది కప్పు గెలవడానికే గానీ కొత్త ఆటగాళ్లను తీసుకురావడానికి కాదు. అందుకే RR ట్రోఫీ గెలిచి 17 ఏళ్లయింది’ అని గుర్తుచేశారు.
News April 21, 2025
అనకాపల్లి: సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్

ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామి ఫీల్డ్ అసిస్టెంట్లు అనకాపల్లి కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన చేపట్టారు. 19 ఏళ్లుగా కూలీలకు, రైతులకు, గ్రామానికి సేవలు చేస్తున్నామని ఐనప్పటికీ తగిన గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.