News March 27, 2025
WGL: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం WGL, HNK, MLG, JN, BHPL, MHBD డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
Similar News
News March 30, 2025
పేదలూ సన్న బియ్యం తినాలనేది మా ఆకాంక్ష: సీఎం

TG: దేశానికే ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతామని CM రేవంత్ వెల్లడించారు. HYDకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మాట్లాడుతూ శ్రీమంతుల మాదిరే పేదలూ సన్న బియ్యం తినాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. సన్న బియ్యం పండించే రైతులకు బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది 1.56L మె.టన్నుల ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు చెప్పారు.
News March 30, 2025
ఏలూరు: జైల్లో శాంతకుమారి మృతి.. మిస్టరీ ఏమిటి?

ఏలూరు జిల్లా జైలులో ఆదివారం ఉదయం హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న శాంత కుమారి మృతి చెందింది. అయితే జైల్లో అనేక కట్టుదిట్టమైన భద్రతలు ఉంటాయి. ఇటువంటి తరుణంలో జైల్లో ఉరివేసుకుని మృతి చెందటం పలు అనుమానాలకు దారితీస్తుంది. శాంతికుమారి మృతి పలు రాజకీయ కోణాలతో మిస్టరీగా ఏర్పడింది. శాంతి కుమారి తన భర్తను హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో చిక్కుముడి వీడింది. శాంత కుమారి మృతి వెనక మిస్టరీ ఏమిటనేది తెలియాల్సి ఉంది.
News March 30, 2025
శ్రీకాకుళం: వివాహిత హత్యకు కారణాలేంటి..?

శ్రీకాకుళం జిల్లాలో ఓ వివాహిత శుక్రవారం దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు వివరాల ప్రకారం.. కవిటి (మ) ఆర్.కరపాడుకు చెందిన మీనా, భర్త దిలీప్తో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా దుండగలు బీరు సిసాలతో తమపై దాడి చేశారని దిలీప్ చెప్పాడు. గాయపడిన మీనాక్షిని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. ఎస్సై రవివర్మ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు.