News March 29, 2025

WGL: పసుపు క్వింటాకు రూ.9329

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం పసుపు, పల్లికాయ తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకి రూ.29,700, సింగిల్ పట్టికి రూ.28వేలు రాగా, దీపిక మిర్చి రూ.13,000 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే పసుపు క్వింటాకి రూ.9,329, సూక పల్లికాయ రూ.7,500, మక్కలు (బిల్టీ) రూ.2255 ధర పలికింది.

Similar News

News April 2, 2025

రికార్డు సృష్టించిన విజయవాడ రైల్వే డివిజన్

image

విజయవాడ రైల్వే డివిజన్‌కు 2024- 25 ఆర్థిక సంవత్సరంలో రూ.5,386.61 కోట్ల స్థూల ఆదాయం లభించిందని డివిజన్ రైల్వే మేనేజర్(DRM) నరేంద్ర పాటిల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు ఓ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధిక ఆదాయమన్నారు. 38.322 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా రూ.4,239.74 కోట్ల ఆదాయం డివిజన్‌కు లభించిందని DRM పేర్కొన్నారు.

News April 2, 2025

ఏపీలో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అలాగే గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాలోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

News April 2, 2025

చినగంజాం మండలంలో షిప్ బిల్డింగ్: CM

image

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి అభ్యర్థన మేరకు చినగంజాం మండలంలో షిప్ బిల్డింగ్, షిప్ రిపేరింగ్ ఇండస్ట్రీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే చినగంజాంలో వ్యవసాయ మార్కెట్ యార్డుకు కృషి చేస్తామన్నారు. కొమ్ముమూరి కాలువ ఆధునికీకరణ, మండలంలో డిగ్రీ కళాశాల నిర్మాణం, మినీ స్టేడియం, మోటుపల్లి నుంచి కారిడార్ నిర్మాణానికి సీఎంకు ఎమ్మెల్యే విన్నవించారు.

error: Content is protected !!