News April 15, 2024

వామ్మో.. ఒకే కుటుంబంలో 350 మంది ఓటర్లు

image

APR 19న అస్సాంలో తొలి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సోనిట్‌పూర్(D) ఫులోగురి నేపాలీ పామ్ గ్రామంలో ఒకే ఇంట్లో 350 ఓట్లు ఉన్నాయి. దివంగత బహదూర్ తాపా అనే వ్యక్తి ఐదుగురు భార్యల ద్వారా 12 మంది కొడుకులు, 9 మంది ఆడపిల్లలను కన్నారు. కోడళ్లు, అల్లుళ్లు, పిల్లలు, మనవళ్లు, మునిమనవళ్లతో కలిపి జనాభా 1,200కు చేరింది. వీరంతా అదే ఊరిలో 300 ఇళ్లలో నివసిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News October 16, 2024

SBI క్రెడిట్‌కార్డు యూజర్లకు గుడ్ న్యూస్

image

దేశవ్యాప్తంగా ఉన్న 19.5 మిలియన్ల SBI క్రెడిట్ కార్డు యూజర్లకు సంస్థ శుభవార్త చెప్పింది. పండుగల సీజన్ సందర్భంగా ‘ఖుషియోన్ కా ఉత్సవ్’ పేరుతో కొనుగోళ్లపై ప్రత్యేక <>ఆఫర్లను<<>> ప్రకటించింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్లు, మొబైల్ ఫోన్స్, ఫ్యాషన్&లైఫ్‌స్టైల్, ఆభరణాలు, ల్యాప్‌టాప్స్, టీవీలు, దుస్తులు, ఫుడ్, డొమెస్టిక్ ఫ్లైట్స్ టికెట్ ధరలు తదితర వాటిపై భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, EMI ఆఫర్లు ఉన్నాయి.

News October 16, 2024

అద్భుతం: కలలోనూ సమాచార మార్పిడి!

image

కలగంటున్న ఇద్దరు వ్యక్తులకు సమాచారాన్ని పంపడంలో కాలిఫోర్నియా సైంటిస్టులు విజయం సాధించారు. ‘డెయిలీ మెయిల్’ కథనం ప్రకారం.. నిద్రపోవడానికి ముందు ఇద్దరు అభ్యర్థులకు బ్రెయిన్‌ను పర్యవేక్షించే పరికరాల్ని పరిశోధకులు అమర్చారు. యంత్రం ద్వారా ఓ పదాన్ని వారికి పంపించగా, నిద్రలోనే పైకి పలికారని వివరించారు. ఇది మానసిక అనారోగ్యాల చికిత్సలో మున్ముందు కీలకంగా మారొచ్చని సైంటిస్టులు పేర్కొన్నారు.

News October 16, 2024

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

image

శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోని భక్తులు కూడా అయ్యప్పను దర్శనం చేసుకోవచ్చని పినరయి విజయన్ సర్కార్ ప్రకటించింది. వర్చువల్ బుకింగ్‌పై విపక్షాలు, భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో విజయన్ దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వచ్చిన వారికి కూడా దర్శన సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.