News September 2, 2024
వామ్మో.. వీళ్లిద్దరూ లేకపోతే?

TG: వరద ఉద్ధృతికి పలు చోట్ల రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి. MHBD జిల్లా తాళ్లపూసపల్లి సమీపంలో ట్రాక్ కొట్టుకుపోయింది. ట్రాక్మన్ జగదీశ్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి రా.12గంటల సమయంలోనే పైఅధికారులకు సమాచారం ఇచ్చారు. అటు ఇంటికన్నె వద్ద వరద ప్రభావంతో ట్రాక్ గాల్లో తేలింది. ట్రాక్మన్ మోహన్ సమయానికి సమాచారం ఇచ్చారు. దీంతో రైళ్లను నిలిపివేసి ప్రమాదాలను నివారించారు. లేకపోతే వందల మరణాలు సంభవించేవేమో!
Similar News
News December 18, 2025
స్పీకర్ నిర్ణయంపై మేము స్పందించం: రేవంత్

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో <<18592868>>స్పీకర్<<>> నిర్ణయంపై పార్టీ పరంగా తాము స్పందించబోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సొంత ఎమ్మెల్యేలు తమ పార్టీలో లేరని చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో బీఆర్ఎస్ ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే న్యాయస్థానాలకు వెళ్లవచ్చని తెలిపారు. అటు ప్రతిపక్షాలకు ఇంకా అహం తగ్గలేదని, 2029 ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
News December 18, 2025
కొత్త మెడికల్ కాలేజీల్లో 96కి పెరిగిన పీజీ సీట్లు

AP: కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అదనంగా 36 PG సీట్లను నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసింది. ఈ కాలేజీల్లో అదనపు సీట్ల కోసం నియామకాలు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పించగా ప్రిన్సిపాళ్లు MNCకి దరఖాస్తు చేశారు. మంత్రి సత్యకుమార్ సంప్రదింపులతో తాజా సీట్లు శాంక్షన్ అయ్యాయి. ఏలూరుకు 12, రాజమండ్రికి 4, నంద్యాలకు 4, విజయనగరానికి 8, మచిలీపట్నానికి 8 కేటాయించారు. గతంలో 60 సీట్లు రాగా ఇప్పుడవి 96కు చేరాయి.
News December 18, 2025
చలి పెరిగింది.. పాడి పశువుల సంరక్షణకు సూచనలు

రాత్రి వేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటే పశువుల షెడ్లలో కరెంటు బల్బులను ఏర్పాటు చేసి వెలుతురు, వేడిని అందించాలి. రాత్రివేళ పశువులను ఉంచే పాకలు, కొట్టాలు, షెడ్ల చుట్టూ గోనెసంచులతో లేదా తడికెలతో కప్పి ఉంచాలి. తడిగా, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను ఉంచకూడదు. పశువులకు గోరువెచ్చని నీటిని అందించాలి. వెటర్నరీ వైద్యుల సూచన మేరకు అవసరమైన టీకాలను పశువులకు అందించాలి.


