News September 2, 2024
వామ్మో.. వీళ్లిద్దరూ లేకపోతే?

TG: వరద ఉద్ధృతికి పలు చోట్ల రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయి. MHBD జిల్లా తాళ్లపూసపల్లి సమీపంలో ట్రాక్ కొట్టుకుపోయింది. ట్రాక్మన్ జగదీశ్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి రా.12గంటల సమయంలోనే పైఅధికారులకు సమాచారం ఇచ్చారు. అటు ఇంటికన్నె వద్ద వరద ప్రభావంతో ట్రాక్ గాల్లో తేలింది. ట్రాక్మన్ మోహన్ సమయానికి సమాచారం ఇచ్చారు. దీంతో రైళ్లను నిలిపివేసి ప్రమాదాలను నివారించారు. లేకపోతే వందల మరణాలు సంభవించేవేమో!
Similar News
News December 24, 2025
చిన్న సినిమాల హవా.. రేపు థియేటర్లలోకి మరిన్ని!

బాక్సాఫీసు వద్ద ఇటీవల పలు చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. రేపు నాలుగైదు చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆది సాయి కుమార్ ‘శంబాల’, శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ‘ఛాంపియన్’, శివాజీ, నవదీప్ నటించిన ‘దండోరా’, హారర్ ఫిల్మ్ ‘ఈషా’, యూత్ ఫుల్ మూవీ ‘పతంగ్’ వంటివి ఈ లిస్టులో ఉన్నాయి. వీటితో పాటు ‘వృషభ’, ‘మార్క్’ లాంటి డబ్బింగ్ సినిమాలు రాబోతున్నాయి. వీటిలో మీరు దేనికి వెళ్తున్నారు?
News December 24, 2025
పళ్ల ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే పాలు, పెరుగు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటినుంచి దంతాలకు కావాల్సిన క్యాల్షియం, ఫాస్ఫరస్ అందుతాయి. పాలకూర, తోటకూర తినడం వల్ల విటమిన్ A, C, ఫోలేట్ అందుతాయి. ఆపిల్స్, క్యారట్స్, నారింజ, మామిడి, ఉసిరికాయలు, చేపలు, గుడ్లు తినాలి. తీపి పదార్థాలు, చిప్స్, స్పైసీ ఫుడ్స్ తినడం తగ్గించాలంటున్నారు. పంటి ఆరోగ్యం బావుంటే మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు.
News December 24, 2025
రూ.100 కోట్ల అక్రమాస్తులు.. కిషన్ నాయక్కు 14 రోజుల రిమాండ్

TG: మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో చంచల్గూడ జైలుకు తరలించారు. కొన్నిరోజులుగా ఆయన నివాసాల్లో చేస్తున్న <<18652795>>సోదాల్లో<<>> పలు జిల్లాల్లో 40 ఎకరాల పొలం, హోటళ్లు, భారీగా బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్ల పైగానే ఉంటుందని సమాచారం.


