News May 2, 2024

వామ్మో.. 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

AP: రాష్ట్రంలో ఇవాళ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తించాయి. ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1, మార్కాపురంలో 47, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 46.7, మొత్తం 14 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 33 మండలాల్లో తీవ్ర వడగాలులు, 188 మండలాల్లో వడగాలులు వీచాయి. రేపు, ఎల్లుండి అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే మండలాల జాబితా కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News January 20, 2026

నైనీ కోల్ టెండర్లపై CBIతో విచారించాలి: రాంచందర్

image

TG: నైనీ కోల్ బ్లాక్‌ టెండర్ల వివాదంతో CM, మంత్రుల విభేదాలు బట్టబయలయ్యాయని TBJP చీఫ్ రాంచందర్ రావు విమర్శించారు. ‘బంధువులకు గనులు కేటాయించుకోవాలని చూశారు. మీడియాలో వార్తలతో టెండర్లు రద్దు చేశారు. దీనిపై CBI, మరేదైన సంస్థతో విచారించాలి’ అని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసే అర్హత BRSకు లేదన్నారు. BRS హయాం నుంచి ఇప్పటి INC GOVT వరకు జరిగిన అవినీతిపై విచారణ జరగాలని పేర్కొన్నారు.

News January 20, 2026

ఆ దేశాలనూ అమెరికాలో కలిపేసిన ట్రంప్!

image

యూరోపియన్ దేశాలు, US మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ట్రంప్ రిలీజ్ చేసిన AI జనరేటెడ్ మ్యాప్ వైరల్ అవుతోంది. అందులో కెనడా, గ్రీన్‌లాండ్, వెనిజులా US భూభాగానికి చెందినవి అన్నట్లు ఉంది. ఈ ఫొటోను ఆయన ట్రూత్‌లో పోస్ట్ చేశారు. గతేడాది EU లీడర్లతో ట్రంప్ భేటీ కాగా, అప్పటి ఫొటోను మార్ఫ్ చేశారు. ఆ సమయంలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్, ఇటలీ PM మెలోని, UK PM కీర్ స్టార్మర్‌ తదితరులతో ట్రంప్ సమావేశమయ్యారు.

News January 20, 2026

రోజూ 8 గ్లాసుల నీళ్లు తాగాలా?

image

ప్రతి ఒక్కరూ రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగాలనే నియమానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని డాక్టర్లు చెబుతున్నారు. నీటి అవసరం అనేది మనిషి బరువు, చేసే పని, ఉండే వాతావరణంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అందరికీ ఒకే లెక్క సరిపోదని, మన శరీరానికి నీరు కావాలనిపించినప్పుడు ‘దాహం’ రూపంలో సంకేతం ఇస్తుందని వివరించారు. అందువల్ల దాహం వేయకపోయినా బలవంతంగా నీళ్లు తాగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. SHARE IT